Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Governor Abdul Nazeer: సంస్కృతం లేనిదే సంస్కృతి లేదు

Governor Abdul Nazeer: సంస్కృతం లేనిదే సంస్కృతి లేదు

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ సంస్కృత సమ్మేళనం

సంస్కృతం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటిగా వున్న విషయం తెలిసిందేనని, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మైసూర్‌లోని సంస్కృతి ఫౌండేషన్‌ల సహకారంతో జాతీయ సంస్కృత సదస్సును నిర్వహించేందుకు ఆధ్యాద్మిక నగరమైన తిరుపతిని వేదికగా ఎంచుకున్నందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ & సాహిత్య అకాడమీ వారికి అభినందనలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు.

- Advertisement -

స్థానిక జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ వారికి పూర్ణకుంభ స్వాగతం లభించింది. చెలికాని అన్నారావు భవన్ లో ఏర్పాటు చేసిన విజ్ఞాన , పుస్తక , వస్తు ప్రదర్శిని, పాండు లిపి, తాళపత్ర గ్రంధాలు ప్రదర్శనలు తిలకించి, జాతీయ సంస్కృత సదస్సు ముగింపు సందర్భగా రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర గవర్నర్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జాతీయ సంస్కృత సమ్మేళనం నిర్వహించి ,సంస్కృతాన్ని అట్టడుగు స్థాయికి తీసుకెళ్లడం , సంస్కృత సాహిత్యం , భాష పునాది అనే వాస్తవ అంశంపై ప్రజలలో అవగాహన పెంచడం అనే దృష్టితో నిర్వహించబడడం సంతోషంగా ఉందిని అన్నారు. ఈ 3 రోజుల సదస్సులో పాల్గొన్న ప్రముఖ సంస్కృత పండితులు, రచయితలు, కవులు. పరిశోధకులందరికీ నా హృదయపూర్వక అభనందనలు అన్నారు. మనరాజ్యాంగంలో భారతదేశం యొక్క 22 అధికారిక భాషలలో ఒకటిగా గర్వంగా పేర్కొనబడి ,హిందీ, కన్నడ మరియు మలయాళం వంటి ఇతర భారతీయ భాషలపై సంస్కృతం ప్రధాన ప్రభావాన్ని చూపింది, నేటికీ కర్ణాటక (నా స్వరాష్ట్రం )మధ్యప్రదేశ్‌లోని ఐదు గ్రామాలకు సంస్కృతం ప్రథమ భాష గా వుంది, చైనా, థాయ్‌లాండ్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్‌లో మాట్లాడే భాషలు సంస్కృతం ద్వారా విపరీతంగా ప్రభావితమయ్యాయి అన్నారు. భారతదేశం 5000 మాట్లాడే భాషల భాండాగారాన్ని కలిగి ఉన్నప్పటికీ, సంస్కృతం మాత్రమే పవిత్రమైన భాషగా పరిగణించబడుతున్నది , ఇది చాలా పురాతన సాహిత్యం మరియు జ్ఞానం మరియు సంస్కృతి యొక్క ప్రాథమిక మూలంగా నిలిచిందని అన్నారు. సంస్కృత భాషను ప్రోత్సహించడానికి.


భారతదేశంలోని వందలాది విద్యాసంస్థల్లో సంస్కృతం బోధించబ డుతూ ఒక సబ్జెక్ట్‌గా కొనసాగుతోంద ని గుర్తుచేశారు. ఈ సాంప్రదాయ భారతీయ భాషను పునరుద్ధరించడానికి ,ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం గత మూడు దశాబ్దాలుగా తన నోడల్ ఏజెన్సీ రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, న్యూఢిల్లీ ద్వారా అనేక పథకాలను అమలు చేస్తోందని వివరించారు.

తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం -జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం అనే సంస్కృతంలో రెండు ప్రసిద్ధ ఉన్నత విద్యా సంస్థలు ఉన్నాయి, యూనివర్శిటీ లైబ్రరీలో సుమారు 1,22,946 పుస్తకాలు మరియు సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళం మరియు దేవనాగరి, గ్రంథం, తెలుగు, కన్నడ, తీగలరి మొదలైన వివిధ లిపిలలో 6000 కంటే ఎక్కువ మాన్యుస్క్రిప్ట్‌లు వున్నాయి,
మరోవైపు శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం, వేదాలు, శాస్త్రాలను బోధించడానికి, క్రమబద్ధమైన పరిశోధనలను నిర్వహించడానికి అంకితమైన ఒక ప్రత్యేకమైన ఉన్నత విద్యా సంస్థ. దాదాపు 3000 పురాతన మాన్యుస్క్రిప్ట్‌లు సేకరించి, భౌతిక, డిజిటలైజ్డ్ రూపంలో భద్రపరచి పరిశోధకులకు సహాయపడ నున్నాయి అన్నారు. పురాతన , మధ్యయుగ కాలాల్లో సంస్కృతంలో మతపరమైన మరియు తాత్విక రచనలు మాత్రమే కాకుండా, వివిధ శాస్త్రాలు మరియు చట్టపరమైన డైజెస్ట్‌లు కూడా వ్రాయబడ్డాయి. సంస్కృతం గణితం, ఖగోళ శాస్త్రం, లోహశాస్త్రం, వ్యవసాయం, అభిజ్ఞా శాస్త్రాలు, యోగా, మనస్తత్వశాస్త్రం, నృత్యం, సంగీతం, సాహిత్యం, జీవశాస్త్రం, సివిల్ ఇంజనీరింగ్, న్యాయశాస్త్రం మరియు తర్కం వంటి ఇతర విజ్ఞాన రంగాలకు దోహదపడిందని అన్నారు. మహాత్మా గాంధీ ఒకసారి సంస్కృతం ప్రాముఖ్యత గురించి చెబుతూ సంస్కృతం అధ్యయనం లేకుండా భారతీయుడు నేర్చుకోలేడని అన్నారు.

సుప్రసిద్ధ జర్మన్ ఫిలోలజిస్ట్ మరియు ఓరియంటలిస్ట్ అయిన మాక్స్ ముల్లర్ ఋగ్వేదాన్ని మొదటిసారిగా అనువదించి 1874 -1884 మధ్య 49 సంపుటాలలో తన ‘ది సేక్రెడ్ బుక్స్ ఆఫ్ ది ఈస్ట్’ లో వివరించారు. చాలా మంది పాశ్చాత్య శాస్త్రవేత్తలు, పండితులు సంస్కృత సాహిత్యం నుండి పొందిన జ్ఞానం నుండి ప్రయోజనం పొందారని అన్నారు. జాతీయ సంస్కృత మహాసభను విజయవంతంగా నిర్వహించినందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, సాహిత్య అకాడమీ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, సంస్కృతి ఫౌండేషన్‌ని నేను అభినందిస్తున్నా, సంస్కృత సాహిత్యం, భాష గొప్పతనంపై ప్రజలకు అవగాహన కల్పించి, వారి భవిష్యత్ ప్రయత్నాలలో విజయం సాధించాలని కోరుకుంటున్నాని సంస్కృతం లేనిదే సంస్కృతి లేదని నమ్ముతూ డాక్టర్ కె. శ్రీనివాసరావు కార్యదర్శి, సాహిత్య అకాడమీ, ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్. కృష్ణ మూర్తి వైస్ ఛాన్సలర్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం , హాజరైన ప్రముఖులకు మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు అన్నారు.

సదస్సులో గవర్నర్ వారిని ఘనంగా సన్మానించి , శ్రీవారి చిత్ర పటాన్ని బహూకరించారు వేదిక్ యూనివర్సిటీ విసి రాణి సదాశివ మూర్తి, మాజీ విసి హరే కృష్ణ శతపతి, మహిళా యూనివర్సిటీ విసి భారతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. గవర్నర్ పర్యటనలో ఎస్ పి పరమేశ్వర రెడ్డి, అడిషనల్ ఎస్ పిలు కులశేఖర్, విమల కుమారి డి ఎస్ పి లు నరసప్ప, నందకిషార్, భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News