Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA Hafeez: టీడీపీ హయాంలో ప్రచారం ఎక్కువ పని తక్కువ

MLA Hafeez: టీడీపీ హయాంలో ప్రచారం ఎక్కువ పని తక్కువ

వైసీపీ ప్రభుత్వంలో ప్రచారం తక్కువ ప్రజా సంక్షేమమే ఎక్కువ

కర్నూలు నగరంలోని 3,8,14,23 వార్డుల్లో ఉన్న 7వ,20వ,32 & 33వ,58 & 59వ సచివాలయలలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా పలువురు లబ్ధిదారులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మాట్లాడుతూ ..రాష్ట్ర ప్రజా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు మరింత చేరువుగా వారి కష్టాన్ని తీర్చుటకు సచివాలయలను పెట్టిన 100 కి 95 శాతం పూర్తి అవుతున్న ఇంకా ఆ పేద బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ పథకాలు, సర్టిఫికేట్ లు అందని వారికి మరింత మంచిని చేయాలనే లక్ష్యంతో సచివాలయంకి లబ్దిదారులు వారి సమస్యలు చెప్పుకోలేని ఇంకా ఉన్నారేమో అని గ్రహించి ప్రజలకు మరింత చేరువ చేయాలనే ధ్యేయంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు.

- Advertisement -

జగనన్న సురక్ష కార్యక్రమంలో ఇన్కమ్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, వైస్సార్ ఆరోగ్య శ్రీ, రైస్ కార్డు, బర్త్ సర్టిఫికెట్, ఫ్యామిలీ సర్టిఫికెట్… అందజేశారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వార్డ్ ఇంచార్జిలు,స్పెషల్ ఆఫీసర్, సచివాలయం సిబ్బంది, సచివాలయం కన్వీనర్లు,పార్టీ ముఖ్య నాయకులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News