Friday, September 20, 2024
HomeతెలంగాణSankar Naik: కాంగ్రెస్ చీకటి రోజులు కావాలా? బిఆర్ఎస్ వెలుగులు కావాలా ?

Sankar Naik: కాంగ్రెస్ చీకటి రోజులు కావాలా? బిఆర్ఎస్ వెలుగులు కావాలా ?

మోసపోతే గోస పడ్తం

రైతులకు ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ వైఖరి ని నిరసిస్తూ మహబూబాబాద్ పట్టణంలోని రైతు వేదిక వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మహబూబాబాద్ శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ 3 గంటల కరెంటు విధానం, బిజెపి పార్టీ మోటర్లకు మీటర్లు వల్ల రైతులను మోసం చేయడమేనన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం మూడు పంటలకు 24 గంటల కరెంట్ వల్ల ఈరోజు రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువు చంద్రాబాబు పాలనలో కరెంటు అడిగితే కాల్చి చంపారనీ రేవంత్ ప్రస్తుత పార్టీ కాంగ్రెస్ పాలనలో భూమి అడిగితే బుల్లెట్ దించారన్నారు.

- Advertisement -


ఇప్పుడు గత గాయాలను గుర్తు చేస్తూ తాము అధికారంలోకి వస్తే రైతులకు ఉచిత కరెంటు ఇచ్చేది లేదంటున్నాడని, అందువల్ల రైతన్నల్లారా తస్మాత్ జాగ్రత్త మోసపోతే గోస పడ్తం అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రియాంక, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మండల అధ్యక్షులు తెల్ల శ్రీనివాస్, పిఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, ఏఎంసి వైస్ చైర్మన్ గుండా రాజశేఖర్, సూదగని మురళి, లునవత్ అశోక్, యళ్ల మురళీధర్ రెడ్డి, చిట్యాల జనార్దన్, నర్సింగ్ వెంకన్న, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News