Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Gangula: చిత్రేణిపల్లెలో టిడిపికి షాక్

Gangula: చిత్రేణిపల్లెలో టిడిపికి షాక్

టిడిపి వీడి వైసీపీలో చేరిక

రుద్రవరం మండలంలోని చిత్రేణిపల్లె గ్రామంలో వైసిపి నాయకులు టిడిపికి షాక్ ఇచ్చారు. గ్రామంలోని టిడిపికి చెందిన సుమారు 10 కుటుంబాలకు చెందిన వారు ఎమ్మెల్యే గంగుల ఆధ్వర్యంలో వైసిపి కండువా కప్పుకున్నారు. మండలంలోని యర్రగుడిదిన్నె గ్రామంలోని గంగుల స్వగృహంలో ఆళ్ళగడ్డ శాసన సభ్యులు గంగుల బ్రీజెంద్ర రెడ్డి (నాని) సమక్షంలో రుద్రవరం మండలం చిత్రేనిపల్లే గ్రామనికి చెందిన కంచి పెద్ద నరసింహుడు, కంచి లక్ష్మి నరసింహుడు,కంచి ప్రసాద్,జంగం నాగేంద్రుడు,జంగం చెన్నయ్య,జంగం నాగరాజు,జంగం తిరుపాలు, ప్రతాప్,లక్ష్మి పాములేటి,చంద్రశేఖర్,చిన్న ఓబులేసు,చిన్న ఒబయ్య,పెద్ద నర్సింహులు,నర్సింహా తోపాటు దాదాపు పది కుటుంబాలకు చెందినవారికి ఎమ్మెల్యే గంగుల వైఎస్సార్సీపీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీర రాఘవరెడ్డి, జే సి ఎస్ మండల పరిధిలో పాణ్యం నాగేష్, గ్రామ వైసీపీ నాయకుడు మాధవ్ గౌడ్, నరసింహయ్య శెట్టి, ఆలమూరు మాజీ సర్పంచ్ జయరాముడు, సుబ్బారావు తోపాటు పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News