Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Hyd: రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన డా.రాజా రమేష్

Hyd: రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన డా.రాజా రమేష్

కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి తెస్తాం

గాంధీభవన్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్ రెడ్డి ని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్ బాబు వారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్ గా నియమించిన సందర్భంగా వారికి పుష్పగుచ్చం అందించి శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ… ఏదైతే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశించిన విధంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్రంలో అటు దేశంలో అధికారంలోకి తీసుకు రావడానికి వారి శిష్య బృందమైన మేము అందరమూ ప్రతిక్షణం కష్టపడి నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులను కార్యకర్తలను అభిమానులను అందరితో మమేకమై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి చోట కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడంలో ముందుంటామని అన్నారు. చెన్నూరు గడ్డ కాంగ్రెస్ అడ్డ అని అక్షరాల నిజం చేసి చూపిస్తామని అన్నారు. నాప్రజలకు చెందాల్సిన వనరులను కాపాడుకోవడం నా బాధ్యత, గ్రామాలను, ప్రజలను, బడిలను అభివృద్ధి చెయ్యడం నాధ్యేయం అన్నారు. చెప్పడమే కాదు చేసి చూపిస్తాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొపతి రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి, మందమర్రి అధ్యక్షులు జీవన్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి వోడ్నాల శ్రీనివాస్, జైపూర్ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, మహేష్, సురేష్, కిరణ్ కుమార్, పవన్, వంశి, నరేష్, శ్రీకాంత్, సూరి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News