Friday, September 27, 2024
Homeపాలిటిక్స్Manchireddy: 600 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిక

Manchireddy: 600 మందికి పైగా కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ లో చేరిక

ప్రగతి వైపే ప్రజల చూపు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ హయత్ నగర్ మండలం రొక్కం భీం రెడ్డి , సీనియర్ నాయకులు జక్కా రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు బొక్క మన్మోహన్ రెడ్డి , సీనియర్ నాయకులు గుర్రం చంద్ర శేఖర్ రెడ్డి , తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు పోరెడ్డి నర్సింహ రెడ్డి , తుర్కయంజాల్ మున్సిపాలిటీ కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నాయకులు మరియమ్మ చెన్నయ్య, 6మంది తుర్కయంజాల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు రొక్కం అనిత చంద్ర శేఖర్ రెడ్డి , మర్రి మాధవి మహేందర్ రెడ్డి , నారని కవిత శేఖర్ గౌడ్ , బొక్క శ్రీలత గౌతమ్ , బొక్క రవీందర్ రెడ్డి , కొండ్రు మల్లేష్ సుమారు 600 మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితి పార్టీలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో చేరారు.

- Advertisement -


ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆకర్షితులై బీఆర్ఎస్ లో చేరుతున్నారనన్నారు. BRS ప్రభుత్వం ముమ్మాటికీ ప్రజల ప్రభుత్వమని కేసిఆర్ పాలనలో రాష్ట్రo బంగారు తెలంగాణ అయిందని దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి జరిగిందని కొనియాడారు. సేవ దృక్పతంతో ముందుకు సాగే వారిని అవరినైనా పార్టీ ఆహ్వానిస్తుందని తెలిపారు.మున్ముందు బారాసా పార్టీలో భారీ చేరికలు వుంటాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News