Sunday, October 6, 2024
HomeతెలంగాణVeernapalli: మాకు పోడు పట్టలు అందేలా చూడండి

Veernapalli: మాకు పోడు పట్టలు అందేలా చూడండి

బాజిరెడ్డికి తమ గోడు చెప్పుకున్న పేదలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం శాంతి నగర్ గ్రామ పెద్దలు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అర్ టి సి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ని నిజామాబాదులోని తన నివాసంలో కలిసారు. రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న మాకు పోడు భూములకు హక్కు పత్రాలు రాలేదు, పోడు భూముల సమస్యలు పరిష్కరించి హక్కు పత్రాలు అందేలా చూడాలనీ సర్పంచ్ కముటం మల్లేశం, బి అర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి, మాజీ ఎంపిటిసి బానోతు కమల విట్టల్, ఉప సర్పంచ్ దేవేందర్ నాయక్ నాయక్ శ్రీనివాస్, రాజు, చంద్రం, శంకర్, తిరుపతి తదితరులు కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News