Saturday, September 21, 2024
Homeఓపన్ పేజ్Open letters: సమాజాన్ని సున్నితంగా ప్రశ్నించే వ్యాసాలు, నిజాలను నిగ్గు తేల్చాలని సంధిస్తున్న లేఖాస్త్రాలు

Open letters: సమాజాన్ని సున్నితంగా ప్రశ్నించే వ్యాసాలు, నిజాలను నిగ్గు తేల్చాలని సంధిస్తున్న లేఖాస్త్రాలు

ప్రతి ఎదలోని ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది

ఏవి.. ఆనాటి విలువలు’ అని ప్రశ్నిస్తూ.. ‘నే చేప్పేదేందంటే…’ అని వివరిస్తూ.. ‘సిద్దాంతాలను రాద్ధాంతం’ చేయరాదని, ‘తప్పొప్పులు’ సరి చూసుకోమని… ఇతరులకు ‘ఉచిత సలహాలు’ ఇవ్వరాదని… వ్రాసే ‘అక్షరాలకు సార్థకత’ కావాలంటూ… ‘అసలైన ఆనందం’ గురించి తెలుసుకోండని… ‘నైతిక విలువలు’ పాటించమంటూ… ఎదుటి వారి ‘ప్రతిభకు కొలమానాలు’ ఎందుకంటా? అని .. లేఖాస్త్రాలు సందించిన అ వ్యక్తం లేఖా వ్యాసాలు పుస్తకం చదివి నా హృదయ స్పందన నలుగురితో పంచుకోవాలనే చిరు ప్రయత్నం.
సమాజాన్ని సున్నితంగా ప్రశ్నించే వ్యాసాలు, నిజాలను నిగ్గు తేల్చాలని మంజు యనమదల సంధిస్తున్న లేఖా వ్యాసాలు. ఈ పుస్తకం ప్రతి ఒక్కరూ చదివి తీరవలసిందే. అందుకు రచయిత్రి ముందు మాటలే బలం చేకూరుస్తాయి. వారి మాటల్లో సగటు మనిషికి న్యాయం అందుబాటులో లేనప్పుడు, ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు. నీతులు, సూక్తి ముక్తావళులు చెప్పడం మానేసి, ముందు మనం, ఆ చెప్పే ‘ఎవ్వరు ఏమనుకున్నా వాటిలో కొన్నయినా పాటించి. అప్పుడు చెప్తే మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం.’
నిరభ్యంతరంగా తనలోని భావాలను, ఎవ్వరేమనుకున్నా నాకేంటి?. నే వ్రాయాలని అనుకుంటున్నది. ‘నిజాలను నిర్భయంగా ప్రకటించడంలో, నా స్వేచ్చను ఎవరి మెహర్బానీ కోసమో, కొల్పోలేను‘. అని చెప్పగల కవయిత్రి ‘మంజు’ యనమదల గారు. ఎన్నో విషయాలపై తనదైన శైలితో, వ్యవస్థలోని అనేక విషయాలను, లోతుగా విశ్లేషిస్తూ వ్రాసిన వ్యాసాలను ‘అవ్యక్తం’ లేఖా వ్యాసాలు పేరుతో పుస్తక రూపంలోనికి తీసుకు రావడం హర్షించదగ్గ విషయం. వ్యక్తపరచాలి అనుకున్నది.. వ్యక్త పరచ లేనిదీ.. తెలుసుకున్నది… నలుగురితో పంచుకోవాలనే తపనకు మూలం, అవ్యక్తం లేఖా వ్యాసాలు పుస్తకం. రాక్షస దుర్గుణాలపై విజయం సాధించగల శక్తినిచ్చేది అక్షరం మాత్రమేనని. అనేక మనస్తత్వాల సముదాయమే సమాజమని. సమాజాన్ని దగ్గరిగా చూపించగల శక్తి అక్షరానికి మాత్రమే ఉందని మరోసారి రుజువు చేసారు ‘కవయిత్రి మంజు యనమదల’గారు.

- Advertisement -


వ్యక్తపరచగలిగిన భావాలను, అక్షరబద్ధం గావిస్తూ అనేక వ్యాసాల రూపంలో, మనకు అందించిన అమూల్యం ఈ అవ్యక్తం లేఖా వ్యాసాలు, నేడు ప్రతి ఒక్కరూ చదవ వలసిన పుస్తకం.. ప్రతి ఎదలోని ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వ్యవస్థను ప్రశ్నించాలి అనుకునే వారికి ఎందుకు ప్రశ్నించాలో వివరించగల పుస్తకం అవ్యక్తం..
నేటి సమాజాన్ని అధ్యయనం చేస్తూ, మనిషి అంతరంగాన్ని శోధిస్తూ సమగ్ర పరిశోధనాత్మక లిఖించిన వ్యాసాలు. ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను చెప్పాలనుకున్నది రాయడం. నా వ్యాసంలో.. మనసు చెప్పినట్లు రాయ డమే. నాకు అలవాటు, మరిదేని కోసమో నేను రచనలు చేయడం లేదు.. ‘సగటు మనిషికి న్యాయం అందుబాటులో లేనప్పుడు, ఎన్ని చట్టాలు చేసినా ఉపయోగం లేదు నీతులు, సూక్తి ముక్తావళులు చెప్పడం మానేసి, ముందు మనం, ఆ చెప్పే వాటిలో కొన్నయినా పాటించి, అప్పుడు చెప్తే మన మనస్సాక్షికి మనం సమాధానం చెప్పుకోగలం అంటారు కవయిత్రి. స్వలాభాపేక్ష లేని ఇటువంటి రచనలను తెలుగు సాహిత్యం స్వాగ తిస్తుంది. అలా సాహిత్య రంగంలో నిలిచిపోగల రచనలు ఎంతో ఓపికతో మనకు అందించిన మంజు యనమదల అమ్మకు హృదయ పూర్వక అభి నందనలు. రాజరిక వ్యవస్థ కనుమరుగై ప్రజాస్వామ్యం విరాజిల్లుతున్న రోజుల్లో.. రంగులు మార్చే రాజకీయ వ్యవస్థను చూస్తూ అక్షరాలను తూ టాలుగా మలిచిన విధానమే. లేఖావ్యాసాలు. ‘వల్లమాలిన ప్రేమలు కురి పిస్తూ లోపల విషపు సెగలు విరజిమ్మే నైజాలిప్పుడు మన చుట్టూ చాలా ఎక్కువే. మనం జాగ్రత్తగా మసలుకోవాలి. ఈ నటనలే అగ్రస్థానాన్ని ఆక్ర మిస్తున్నాయి. చూసి చూసి మనకూ నటన అలవాటై పోతుందేమోనని భయము వేస్తోంది. ఓ పక్కన అంటారు కవయిత్రి.
నిజమైన ప్రతిభకు గుర్తింపు తక్కువే అనే వాస్తవాన్ని ‘మన చుట్టూ ఉన్న వ్యవస్తలో. సమిష్టి విలువలు కాదు. వ్యక్తిగా గుర్తింపు మాత్రమే. ఆ గుర్తింపు అధికారం, బలం, ధనం వలన వస్తుంది అనే సూటి మాటల్లో సమాజాన్ని పోస్టుమార్టం చేసి నిజాలేవో చూపించారు. ‘అర్హత’ అనే వ్యాసంలో ‘రెప్పపాటు ఈ జీవితానికి ఎన్ని రెప్నలు కింద కన్నీటిని పారిం చాలో, శత్రువును తలుచుకున్నంతగా, మిత్రులను కూడా తెలుకోం కొన్ని బాధ్యతల నడుమ బంధాలకు చోటు తక్కువే మరి అనే వాస్తవాన్ని నిర్భ యంగా ప్రకటించడంలో రచయిత్రి ఎదుర్కొన్న ఎన్నో పరిస్ధితిలు ఇక్కడ అక్షర రూపంలో మన కంటికి కనిపిస్తుంటాయి.
కొన్ని వందల ప్రశ్నలకు సమాధానం ఒక్కోసారి మౌనం మాత్రమే. కొన్ని దశాబ్దాల మౌనం విస్ఫోటనం చెందితే వెలువడేది అక్షర వ్యాసం వాస్తవం అంటాను నేను.. ఎన్నో ప్రశ్నలకు.. సమాధానాలు ఈ వ్యాసా లలో రచయిత్రి పొందు పరిచారు. సమాజాన్నీ అధ్యయనం చేయాలను కునే ప్రతి ఒక్కరికి చక్కటి గైడ్‌ లైన్‌ వంటిదే ఈ పుస్తకం అనిపిస్తుంది.
నేడు ఆర్థిక అసమానతల్లో కునారిల్లుతున్న వ్యవస్థలో బంధాలకు, అనుబంధాలకు మధ్య జరిగే మనిషి మానసిక సంఘం, వాటి పర్యవస్థా నాలు చక్కగా వివరించిన వ్యాసాలు. అదే విధంగా నేడు ప్రపంచాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్న టెక్నాలజీ, వాట్సాప్‌, ఫేస్‌ బుక్‌, ఇన్ఫోగ్రామ్‌, వంటి ఎన్నో విషయాలపై, అనేక కోణాల్లో తనదైన భావాలను ప్రస్పు టంగా ప్రకటిస్తూ, మనకు అందిస్తున్న లేఖావ్యాసాలు, ‘అవ్యక్తం లేఖా వ్యాసాలు’ పుస్తకం తప్పక చదవండి. మనం స్పందించలేని, మన మనసు లో గూడుకట్టుకున్న ఎన్నో ప్రశ్నలను సూటిగా, ప్రశ్నించే తత్వాన్ని స్వాగతిద్దాం రండి.

  • రాము కోలా, ఖమ్మం
    9849001201.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News