Sunday, October 6, 2024
Homeనేషనల్Karnataka : హెడ్‌మాస్ట‌ర్‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క్కొట్టిన విద్యార్థినులు

Karnataka : హెడ్‌మాస్ట‌ర్‌ను క‌ర్ర‌ల‌తో చిత‌క్కొట్టిన విద్యార్థినులు

Karnataka : త‌మ‌లో ఒక‌రిని వేధించాడ‌ని ఆరోపిస్తూ ప్ర‌భుత్వ ఉన్నత పాఠ‌శాల‌కు చెందిన ప్ర‌ధానోపాధ్యాయుడిని విద్యార్థినులు క‌ర్ర‌ల‌తో చిత‌క‌బాదారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని శ్రీరంగ‌ప‌ట్నంలో చోటు చేసుకుంది.

- Advertisement -

కట్టారి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన ప్ర‌ధానోపాధ్యాయుడు చిన్మ‌య ఆనంద‌మూర్తి హాస్టల్‌లో ఉన్న మైన‌ర్ విద్యార్థినుల్లో ఒక‌రితో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. బాలిక ఏడుస్తూ వెళ్లి జ‌రిగిన విష‌యాన్ని హాస్టల్‌లో ఉన్న మిగిలిన విద్యార్థినుల‌కు చెప్పింది. దీంతో ఆగ్ర‌హించిన విద్యార్థినులు అత‌డికి బుద్ధి చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

క‌ర్ర‌ల‌ను చేత‌బ‌ట్టుకుని ప్ర‌ధానోపాధ్యాయుడి గ‌దికి వెళ్లారు. ఘ‌ట‌న‌పై అత‌డిని నిల‌దీశారు. అత‌డు వేరే గ‌దిలోకి వెళ్లి త‌లుపులు వేసుకునే ప్ర‌య‌త్నం చేయ‌గా విద్యార్థినులు అడ్డుకున్నారు. అనంత‌రం అత‌డిని క‌ర్ర‌ల‌తో చిత‌క్కొట్టారు. అక్క‌డ ఉన్న ప‌లువురు ఉపాధ్యాయులు విద్యార్థినుల‌ను స‌ముదాయించేందుకు ప్ర‌య‌త్నించినా వారు మాట‌విన‌లేదు. గ‌త కొంత‌కాలంగా అత‌డు త‌మ‌ను వేదిస్తున్న‌ట్లు విద్యార్థినులు తెలిపారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు. విద్యార్థినుల ఫిర్యాదు మేర‌కు ఫోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.నిందితుడిని అరెస్ట్ చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కాగా.. బాలికలు కర్రలతో హెడ్‌మాస్టార్‌ను చితక బాదిన వీడియోలు ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News