Sunday, October 6, 2024
HomeతెలంగాణGHMC alert: వర్షాలను ఎదుర్కొనేందుకు బల్దియా రెడీ

GHMC alert: వర్షాలను ఎదుర్కొనేందుకు బల్దియా రెడీ

మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారు-తలసాని

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరంలో ప్రజలు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సేవలు అందిస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి లతో కలిసి GHMC కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. కంట్రోల్ రూమ్ కు వస్తున్న పిర్యాదులు, పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై మంత్రి ఆరా తీశారు. మూడు షిఫ్ట్ లలో వివిధ శాఖల సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు మంత్రికి వివరించారు. వాతావరణ శాఖ అందించే సమాచారం మేరకు GHMC పరిధిలోని అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

 అనంతరం మంత్రి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత రెడ్డి, GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్, SNDP ENC జియా ఉద్దీన్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ల దూరదృష్టి ఆలోచనలతోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద ముంపు సమస్య తొలగి పోయిందని పేర్కొన్నారు. నగరంలోని నాలాల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన SNDP కార్యక్రమం క్రింద 36 నాలాల అభివృద్ధి పనులు చేపట్టగా, 30 పనులు పూర్తయ్యాయని, మిగిలిన 6 పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు.

 గత సంవత్సరం వరకు బేగంపేట నాలాకు ఎగువ నుండి వచ్చే వరద నీటి వలన నాలా వెంట ఉన్న బ్రాహ్మణ వాడి, శ్యామ్ లాల్ బిల్డింగ్ తదితర కాలనీలు వరద నీటిలో మునిగిపోయి ప్రజలు అనేక అవస్థలు పడే వారని పేర్కొన్నారు. SNDP కార్యక్రమం క్రింద బేగంపేట నాలా అభివృద్ధి పనులు చేపట్టిన ఫలితంగా ఈ సంవత్సరం అలాంటి పరిస్థితి ఏర్పడలేదని చెప్పారు. ప్రారంభంలో SNDP కార్యక్రమం పై పలు విమర్శలు వచ్చాయని, కానీ వాటి ఫలితాలు నేడు కండ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు. అదేవిధంగా విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం దేశంలో ఎక్కడా లేదని, ఆ శాఖ ద్వారా కూడా ప్రజలకు వివిధ అత్యవసర సేవలు అందించబడుతున్నాయని అన్నారు. GHMC కంట్రోల్ రూమ్ కు వచ్చే ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ క్షేత్రస్థాయి లోని సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

 ప్రజలకు నిరంతరం సేవలు అందిస్తున్న అధికారులు, సిబ్బందిని మంత్రి ఈ సందర్బంగా అభినందించారు. అదేవిధంగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడం పట్ల కూడా మంత్రి వారిని అభినందించారు. ప్రజలు అత్యవసర సేవలకు GHMC కంట్రోల్ రూమ్ (040-21111111, 9000113667) కు కాల్ చేయాలని కోరారు. హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లలో ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో పై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నట్లు వివరించారు. భారీ వర్షాల వలన ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా, ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా అవసరమైన చర్యలను చేపట్టేందుకు GHMC పరిధిలో 455 టీం లు పని చేస్తున్నాయని చెప్పారు. DRF, ట్రాఫిక్, మాన్ సూన్, ఎమర్జెన్సీ టీం లు కంట్రోల్ రూమ్ నుండి వచ్చే ఆదేశాలతో ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారని అన్నారు. నీరు నిలిచిపోవడం, చెట్లు కూలిపోవడం, సీవరేజ్ పొంగిపోవడం వంటి పిర్యాదులు అధికంగా వస్తున్నాయని, వీలైనంత త్వరగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. చెత్త తొలగింపు, పారిశుధ్య నిర్వహణ వంటి కార్యక్రమాలు కూడా ఎక్కడ ఆగకుండా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లు కూడా దెబ్బతిన్న ప్రాంతాలలో ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సర్కిల్ కు ఒకటి చొప్పున 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరో 2, 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ప్రకటించిందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మంత్రి కోరారు. మూసారాం బాగ్ వంతెన నిర్మాణ పనులను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ… వర్షాభావ పరిస్థితులను ఎప్పటి కపుడు మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ కి గాని డి ఆర్ ఎఫ్ కంట్రోల్ రూం కు సమస్యల పై వచ్చిన ఫిర్యాదులు  అదే రోజు క్లియర్ వేస్తున్నట్లు చెప్పారు. భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పని చేసే వారందరూ అప్రమత్తంగా  ఉన్నారని తెలిపారు. మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్ తో డి ఆర్ ఎఫ్ , సి ఆర్ ఎం పి టీమ్  మూడు షిఫ్టుల్లో  మొత్తం 2,111 మంది సిబ్బంది  24 గంటల పాటు పని చేస్తున్నారని అన్నారు.  నీరు నిలిచిన ప్రాంతాల్లో నీటిని తొలగించిన తర్వాత మళ్లీ వర్షం రావడంతో  తిరిగి తొలగించడం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. నగరం లో 11 సెంటి మీటర్ల వర్షపాతం  అత్యధికంగా  నమోదు  అయ్యిందని కంట్రోల్ రూమ్ కూడా రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ప్రజలు అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని నగర వాసులను మేయర్ కోరారు.

జిహెచ్ఎంసి  కమిషనర్  రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధిలో 450 టీమ్స్ పనిచేస్తున్నాయని అందులో 39 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను ఏర్పాటు చేసినట్లు, నీటిని తొలగించేందుకు 1097 పంప్ సెట్ లను ఏర్పాటు చేసినట్లు వర్షాలు నేపథ్యంలో పరిశుభ్రంగా ఉంచేందుకు కార్మికులను నగర పరిధిలో 185 చెరువులు ఉండగా ఏడు చెరువులలో  సర్ ప్లస్ నీరు వెళుతున్నట్లు మరో  35 చెరువులలో ఎఫ్ టి ఎల్ కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 339 వాటర్ లాగిన్ పాయింట్ కలవు. జూలై మాసం లో సరాసరి వర్షపాతం కంటే 60 శాతం ఎక్కువగా వర్షం కురిసినట్లు వర్షం నేపథ్యంలో నగరంలో  సర్కిల్ వారీగా ఎప్పటి కప్పుడు పరిస్థితులు ఆరా తీసి అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు.

వర్షా కాలంలో సెల్లార్ నిర్మాణాలను చేపట్టకుండా చర్యలు తీసుకున్నట్లు, ఇంతకు ముందు నిర్మించిన సెల్లార్ ల వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేశామన్నారు.  లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని  అవసరమైతే సర్కిల్ వారీగా 30 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు  సమస్య  ఎదురైతే  తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News