Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్MLA Shilpa: అభివృద్ధి సంక్షేమమే వైసీపీ అజెండా

MLA Shilpa: అభివృద్ధి సంక్షేమమే వైసీపీ అజెండా

జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

బండిఆత్మకూరు మండలంలోని పార్నపల్లి, యర్రగుంట్ల గ్రామాలలో ఎంపీడీఓ వాసుదేవగుప్తా, ఎంఆర్ఓ రవి కుమార్ ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీశైల నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైల నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర రెడ్డి పాల్గొనగా గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలను 99% లబ్దిదారులకు నేరుగా అందించి మిగిలిన ఒక్క శాతం వారికి సంక్షేమ ఫథకాలను జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఎలాంటి చార్జీలు లేకుండా 11 రకాల ధృవపత్రాలను మీ గ్రామములోనే అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎస్ పిడిసిఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళ రెడ్డి, ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి, మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి, మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస రెడ్డి, జెసీఎస్ కన్వీనర్ ముడిమేల పుల్లారెడ్డి, వైస్ ఎంపీపీ రాగల రమణ, పార్నపల్లి సర్పంచ్ షేక్ షబ్బీర్ అహ్మద్, ఎంపీటీసీ శ్రీనివాస రెడ్డి, దిలీప్ కుమార్ రెడ్డి, వైస్ సర్పంచ్ రామలింగేశ్వర రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ భూరం శివలింగం, ఎంఎల్ఓ పార్థసారథి రెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విక్రమ్ సింహ నాయక్, గ్రామ నాయకులు పుల్లారెడ్డి, దూదేకుల పుల్లయ్య, మధుసూదన్ రెడ్డి, లాయర్ సుబ్బరాయుడు, ఎస్ వి నాగిరెడ్డి, సర్పంచ్ కాళ్ళూరి శ్వేత కుమారి, ప్రసాద్,ఎంపీటీసీ మైఖేల్, మండల స్థాయి అధికారులు, సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయం కన్వీనర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News