Sunday, October 6, 2024
HomeతెలంగాణKorukanti Chander: రామగుండంను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Korukanti Chander: రామగుండంను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి సాధ్యం


రామగుండం కార్పొరేషన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 45 వ డివిజన్ భరోసా బస్తీ బాటను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సిఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు అభివృద్ధి ని ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఎర్పాడిన తర్వాతే సిఎం కేసీఆర్‌ పాలనలో ప్రతి కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యంమవుతుందన్నారు. కేటిఆర్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం పట్టణ ప్రగతి ద్వారా ప్రతి నెలకోటి రూపాయలు నిధులు మాంజూరు చేస్తున్నరని అన్నారు. 60 ఎళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టిలతోనే ప్రజలకు ఈ కష్టాలన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా డివిజన్లు అభివృద్ధికి నోచుకోలేదని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వారి పాలన సాగిందన్నారు. కేసీఆర్‌ పాలనలో కార్పొరేషన్లు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్ము వేణు గోపాల్ బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు దొమ్మేటి వాసు చెలకలపల్లి సతీష్ కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News