Friday, September 20, 2024
HomeతెలంగాణPrakash Goud: నాలా పనులు తక్షణం పూర్తి చేయండి

Prakash Goud: నాలా పనులు తక్షణం పూర్తి చేయండి

మున్సిపాలిటీలోని డివిజన్ల అన్నింటినీ అభివృద్ధి చేస్తానన్న ఎమ్మెల్యే

మైలార్దేవపల్లి పరిధిలో ఎస్ ఎన్ డి పి నిధులు 12 కోట్లతో పల్లెచెర్వు నుండి దుర్గ నగర్ వరకు నిర్మిస్తున్న నాలా పనులను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు తన మీద ఉన్న నమ్మకానికి అనుగుణంగా మున్సిపాలిటీలోని డివిజన్ల అన్నింటిని అభివృద్ధి చేస్తామన్నారు. నాలా నిర్మాణంలో డ్రైనేజ్ పైపులు, మంచినీటి పైపులను అన్నిటిని సరి చేస్తూ నాలానిర్మించాలని కాంట్రాక్టర్ కు సూచించారు. వారి వెంట ప్రాజెక్ట్ సి ఈ దేవానంద్, రాజేంద్రనగర్ డిసి రవికుమార్, ఈఈ నరేందర్, హెచ్ ఎండబ్ల్యుఎస్ జి ఎం చంద్రశేఖర్ డివిజన్ నాయకులు ప్రేమ్ గౌడ్ రఘు యాదవ్ సరికొండ వెంకటేష్ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News