Sunday, October 6, 2024
HomeతెలంగాణJagadish Reddy: జగదీష్ రెడ్డికి థాంక్స్ చెప్పిన ఆర్టీసీ ఉద్యోగులు

Jagadish Reddy: జగదీష్ రెడ్డికి థాంక్స్ చెప్పిన ఆర్టీసీ ఉద్యోగులు

మంత్రిని కలిసి థాంక్స్ చెప్పిన ఉద్యోగులు

ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తూ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని ఆర్టీసీ ఉద్యోగులు కలిసి శాలువా కప్పి బొకేతో ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగుల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, కెటిఆర్, జగదీష్ రెడ్డిలకే దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డిపో మేనేజర్ సురేందర్, అసిస్టెంట్ మేనేజర్ నాగశ్రీ, బి, నర్సయ్య, ఎం, లచ్చయ్య, ఏకాంబరం, టివి, రావు, ఆంజనేయులు, బి, సీతా రాములు, తదితరులు కలిసిన వారిలో ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News