Sunday, October 6, 2024
Homeపాలిటిక్స్Somarapu: సోషల్ మీడియాపై శిక్షణ తరగతులు

Somarapu: సోషల్ మీడియాపై శిక్షణ తరగతులు

కేంద్ర ప్రభుత్వ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందే

భారతీయ జనతా పార్టీ రామగుండం నియోజకవర్గంలో మండల నాయకులకు, శక్తి కేంద్రం ఇంచార్జ్ లకు, సోషల్ మీడియా కన్వీనర్లకు, బూత్ అధ్యక్షులకు మరియు బూత్ వాట్సప్ ప్రముఖులకు సోమారపు సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యే అధ్యక్షతన సోషల్ మీడియా పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాలను ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ద్వారా ప్రజలందరికీ తెలియపరచాలని తద్వారా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఓటర్ తెలుస్తాయని, అందుకని ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాపై అవగాహన ఉండాలని దానికోసమని ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో సోషల్ మీడియా ప్రత్యేక శిక్ష తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ నుంచి ప్రత్యేక శిక్షకులుగా రాహుల్, మహేందర్ రెడ్డి పాల్గొని కార్యకర్తలకు సోషల్ మీడియా ద్వారా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ చేసినటువంటి అనేక కార్యక్రమాలను ఏ విధంగా ప్రతి ఒక్కరికీ చేరేలా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్, పెద్దపల్లి ఐటీ సెల్ కన్వీనర్ భీమారపు సంపత్ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున్, అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ, సోషల్ మీడియా కన్వినర్ మామిడి వీరేశం దుబాసి లలిత, అసెంబ్లీ విస్తారక్ నరేందర్ కోదాటి ప్రవీణ్ మండల అధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, పత్తి సంజీవ్, జనగాం రాజాలింగ, సంపంగి సీను, డేవిడ్ రాజు, చంద్రశేఖర్, కమల్ గౌడ్, కిషన్ రావు, చంద్రశేఖర్, వాసు, వడ్డేపల్లి రామచందర్, బద్రి దేవేందర్, కుసుమ కుమారి, సుభాష్ రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ మండల కన్వీనర్లు ఎలుక సంతోష్, సంపంగి విష్ణు, కుందారపు నరేష్, కాదాసీ శంకర్, బొడ్డుపల్లి రంజిత్, అప్పాజీ , అజయ్ అంద రాజ్ కుమార్, సంఘ వినయ్ , అనిల్ రామగుండం నియోజకవర్గం సోషల్ మీడియా జాయింట్ కన్వీనర్ మంద శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News