Friday, September 20, 2024
HomeదైవంMahabubabad: బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి

Mahabubabad: బోనమెత్తిన మంత్రి ఎర్రబెల్లి

కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వపరంగా బోనాల పండుగ

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో, నాంచారి మాడూర్, రాయపర్తి మండలం, కొండూరు గ్రామాలలో జరుగుతున్న బోనాల పండుగకు రాష్ట్ర పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దంపతులు హాజరై బోనం ఎత్తి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి దంపతులు గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి ఉత్సాహంగా ప్రసంగించారు.. మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
“పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలి, నేను ప్రతి సారి అమ్మ వారి బోనాలకు హాజరు అవుతాను, అమ్మవారి ఆశీస్సులు, మీ ఆశీర్వాదం వల్లే నేను ఎమ్మెల్యేను అయ్యాను, మిమ్మల్ని అన్ని విధాలుగా అమ్మ వారు కాపాడాలని కోరుకుంటున్నా…సీఎం కేసీఆర్ గారి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు కావాలని కోరుకున్నా…రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమొద్దు, అలాగే అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నాను, కెసిఆర్ హయాంలోనే ప్రభుత్వపరంగా బోనాల పండుగ చేస్తున్నాం, పండుగలు పబ్బాలకు ప్రత్యేక గుర్తింపు, గౌరవం దక్కుతుంద”ని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున మహిళలు బోనమెత్తి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News