Friday, September 20, 2024
HomeతెలంగాణTelangan Congress: రేవంత్ పై సీనియర్ల తిరుగుబాటు.. ఇక వీళ్ళు మారరా?!

Telangan Congress: రేవంత్ పై సీనియర్ల తిరుగుబాటు.. ఇక వీళ్ళు మారరా?!

- Advertisement -

Telangan Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి అసమ్మతి సెగలు, అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. ఆ మాటకొస్తే అసలు కాంగ్రెస్ పార్టీలో అసమ్మతులు, అగ్రహాలు, గ్రూపులు లేనిది ఎప్పుడు అంటారా?. నిజమే.. ఈ అంతర్గత కుమ్ములాటలతోనే కాంగ్రెస్ తనకు తానే నాశనం చేసుకుంటుంది. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం సమయంలో సీనియర్లంతా గగ్గోలు పెట్టిన సంగతి తెలిసిందే.

అప్పట్లో హైకమాండ్ బుజ్జగింపులతో కాస్త కుదుటపడినా.. అప్పటి ప్రతి విషయంలో రేవంత్ ను చాలామంది సీనియర్ నేతలు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో ఇటీవల పీసీసీ కమిటీల నియామకంపై కాంగ్రెస్ సీనియర్‌ నేతలు రేవంత్‌ పై గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా రేవంత్ పై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్‌ నేతలంతా మూకుమ్మడిగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు తదితర నేతలు ఈ తిరుగుబాటులో ఉండగా.. ముందు నుంచి కాంగ్రెస్ ను నమ్ముకొని పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరిగిందని, కొత్త పీసీసీ కమిటీలలో టిడిపి నుంచి వచ్చిన 50 మందికి చోటు కల్పించారని ఉత్తమ్ మండిపడ్డారు. కాగా, ఈ అసంతృప్తి నేతలకు ఇప్పటికే ఢిల్లీ నుండి పిలుపు రాగా, ప్రియాంకా గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వీళ్ళతో సంప్రదింపులు జరపనున్నారు.

కాగా, కాంగ్రెస్ లో ఆరని ఈ కుమ్ములాటలపై ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మునుగోడు ఉపఎన్నికలలో తన తమ్ముడికి ఓటు వేయాలని చేసినపుడు ఈ సీనియర్లంతా ఏం చేస్తున్నారని, కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారి టీఆర్ఎస్ లో చేరినపుడు ఏం చేశారని నిలదీస్తున్నారు. సొంత పార్టీలోనే ఐక్యత లేకుంటే ఇక ప్రభుత్వంపై ఏం పోరాటం చేస్తారని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇక మీరు మారరా అంటూ మీమ్స్ తో సెటైర్లు వేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News