Saturday, April 19, 2025
Homeనేరాలు-ఘోరాలుMallapur: ముత్యంపేట్ లో దొంగతనం

Mallapur: ముత్యంపేట్ లో దొంగతనం

ఇంటికి తాళం..డబ్బు, బంగారం మాయం

ముత్యంపేట గ్రామానికి చెందిన నిమ్మల లక్ష్మారెడ్డి ఇంటిలో దొంగతనం జరిగింది. లక్ష్మారెడ్డి దుబాయ్ లో ఉంటున్నాడు. లక్ష్మా రెడ్డి భార్య నిమ్మల పద్మ, ఇద్దరు కొడుకులు ఇంటికి తాళం వేసి హైదరాబాద్ వెళ్లారు. తిరిగి ఆదివారం మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూసేసరికి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న బీరువాలోని 30 వేల రూపాయల నగదు 8 గ్రాముల బంగారం,పది తులాల వెండి దొంగలించారు. నిమ్మల పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News