Tuesday, March 11, 2025
Homeపాలిటిక్స్Manchireddy: బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు

Manchireddy: బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు

బీఆర్ఎస్ లోకి భారీగా చేరికలు

తుర్కయంజాల్ మున్సిపాలిటీ ఇంజాపూర్ లోని పలు కాలనీలకు చెందిన 150 మంది వివిధ పార్టీల నాయకులు భారత రాష్ట్ర సమితి పార్టీలో పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మున్సిపాలిటీలలో కాలనీల మౌలిక వసతులు అంచలంచలుగా మెరుగుపరుస్తున్నామని, ఈ మధ్య కాలంలోనే మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ 15కోట్లు మంజూరు చేశారని అన్నారు. ఈ శరవేగమైన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని, బీఆర్ఎస్ తోనే ప్రజలున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News