Sunday, September 29, 2024
HomeతెలంగాణManchiryala ANMs: మా సమస్యలు పట్టవా? ఏఎన్ఎంల ధర్నా

Manchiryala ANMs: మా సమస్యలు పట్టవా? ఏఎన్ఎంల ధర్నా

ప్రభుత్వ విధానం మార్చుకుని, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్స్

తెలంగాణ యునైటెడ్ మెడికల్ & హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయు ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఎఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో సమ్మె ప్రారంభించారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ హాజరై మాట్లాడుతూ… వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని రకాల కాంట్రాక్ట్ ఎఎన్ఎంలను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోమాస ప్రకాష్ సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, పద్మ జిల్లా అధ్యక్షులు, మంజుల జిల్లా కార్యదర్శి, తులసి, రమ, సరిత, సత్యవతి, రాజేశ్వరి, విజయ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News