Sunday, October 6, 2024
HomeతెలంగాణBathina RIP: ఆస్తమాకు చేప మందు బత్తిన అకాల మరణం

Bathina RIP: ఆస్తమాకు చేప మందు బత్తిన అకాల మరణం

మృగశిర కార్తె రోజు అస్తమా రోగులకు చాప మందు ఉచితంగా పంపిణీ చేసే బత్తిని హరినాథ్ గౌడ్ (85) పార్థివ దేహానికి వారి నివాసంలో ఘనంగా నివాళులు ఆర్పించారు పలువురు మంత్రులు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్. వారి అత్మ శాంతించాలని భగవంతున్ని ప్రార్థించారు. వారు అందించిన సేవలను స్మరించుకున్నారు.

- Advertisement -

ఈ సందర్బంగా మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ…
ఎన్నో ఏండ్ల నుండి మృగశిర కార్తీ రోజున అస్తమా రోగులకు ప్రతీ సంవత్సరం హైదరాబాద్ లో బత్తిని కుటుంబ సభ్యులు కోట్లాది మంది ప్రజలకు ఉచితంగా చాపమందును పంపిణీ చేస్తున్నారని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. చాప మందు కోసం వివిధ రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉన్న అస్తమా రోగులకు ఎంతో విలువైన సేవలను బత్తినీ హరినాథ్ గౌడ్ అందించారని కొనియాడారు. బత్తినీ హరినాథ్ గౌడ్ అస్తమా రోగులకు అందించిన సేవలను స్మరించుకున్నారు. వారి మరణం తీరని లోటు అని వెల్లడించారు మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్.

మంత్రుల వెంట ముషీరాబాద్ BRS పార్టీ యువజన నాయకులు ముఠా జై సింహ, అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కురెళ్ళ వెములయ్య, రాష్ట్ర గౌడ సంఘాల సమన్వయ సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, BRS పార్టీ నాయకులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News