Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Emmiganuru: వానదేవుడా కరుణించు

Emmiganuru: వానదేవుడా కరుణించు

వరుణుడి కోసం పాదయాత్ర

సకాలంలో వర్షాలు కురిసి పంటలు సంవృద్దిగా పండాలని కోరుతూ ఎమ్మిగనూరు ఎరువుల, ఫర్టిలైజర్స్ షాపులు డీలర్లు సంఘం అధ్వర్యంలో నదీ జలాలకు పాదయాత్ర చేపట్టారు. కలశాలతో ఎమ్మిగనూరు పట్టణంలోని శ్రీ నీలకంటేశ్వర స్వామి దేవాలయం, వీవర్స్ కాలనీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడ నుండి నందవరం మండలం గురుజాల శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో నీటినీ తీసుకురావడానికి పాదయాత్రగా వెళ్లారు. సాంప్రదాయ పద్ధతిలో ఆయుధాలు చేతపట్టి, బిందెలు భుజాన పెట్టుకొని.. వనదేవా కరుణించు వర్షాలు కురిపించి కరుణించాలి అంటూ వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు తాలూకా ఫర్టి లైజర్స్ షాపులు డీలర్ల సంఘం అధ్యక్షుడు పార్లపల్లి సర్పంచ్ సత్య రెడ్డి, ప్రధాన కార్యదర్శి అంజిరెడ్డి, కోశాధికారి నాగరాజు, గౌరవ అధ్యక్షులు, మహేష్ కుమార్, పురుషోత్తమ గౌడ్ తో పాటు నాయకులు వేంకటేశ్వర రెడ్డి, కొంచెం మహేశ్వర రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, మహేంద్ర, మంజునాథ మల్లికార్జున, గోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News