Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Mohan Babu: ప్రభుత్వ తొత్తుల్లా పనిచేస్తున్న పోలీసులు.. మోహన్ బాబు సంచలన కామెంట్స్

Mohan Babu: ప్రభుత్వ తొత్తుల్లా పనిచేస్తున్న పోలీసులు.. మోహన్ బాబు సంచలన కామెంట్స్

- Advertisement -

Mohan Babu : విశాల్ హీరోగా తెరకెక్కించిన సినిమా లాఠీ. ఈ సినిమా డిసెంబర్ 22న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పోలీస్ వ్యవస్థలో ఉన్న కానిస్టేబుల్స్ గురించి, వారి జీవితాల గురించి చెప్తూ ఈ సినిమాని కమర్షియల్ ఫార్మేట్ లో తీశారు.

చిత్ర యూనిట్ గత కొన్ని రోజులుగా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా లాఠీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ మోహన్ బాబు పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మోహన్ బాబు మాట్లాడుతూ.. ఇప్పటి పోలీసులు ఏ ప్రభుత్వం ఉంటే వారికి తొత్తుల్లా పని చేయాల్సి వస్తుంది. సమాజంలో తమ కళ్ళ ముందే కొన్ని తప్పులు జరుగుతున్నా ఏమి చేయలేని స్థితిలో ఉన్నారు పోలీసులు. వాటి గురించి మాట్లాడినా, తప్పు అని చెప్పినా తమ ఉద్యోగాలు ఎక్కడ పోతాయో అని భయపడుతున్నారు. ఎంతోమంది IAS,IPS ఉన్నతాధికారులు కూడా ప్రభుతం చెప్పినట్టే చేయాల్సి వస్తుంది. అలాంటివి నేనే స్వయంగా కొన్ని చూశాను అని తెలిపారు.

దీంతో మోహన్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరి ఎవరైనా పోలీసు ఉన్నతాధికారులు దీనికి స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News