Sunday, October 6, 2024
HomeNewsMadhavaram Krishnarao: సమస్యలే లేని కూకట్ పల్లి

Madhavaram Krishnarao: సమస్యలే లేని కూకట్ పల్లి

సమస్యలన్నీ తీర్చేస్తానంటున్న ఎమ్మెల్యే

వర్షాలు వస్తే సమస్యలతో ఉండే కూకట్ పల్లిని సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ సహకారంతో సమస్యలు లేని కూకట్ పల్లిగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్ పల్లి నియోజక వర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మూసాపేట్ డివిజన్ లో మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో 22 వ రోజు పాదయాత్ర నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మూసాపేట డివిజన్లో సమస్యలతో ఉండే డివిజన్లో రోడ్లు డ్రైనేజీలు మంచినీటి పైప్లైన్లు వేసి 80% సమస్యలను పరిష్కరించామని పాదయాత్ర చేస్తుంటే మూసాపేటలో అడుగడుగునా ప్రజలు పూలు వేసి శాలువాల్తో సత్కారం చేసి బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుందని ప్రశంసిస్తున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు… పెండింగ్లో ఉన్న సమస్యలతో పాటుగా పెన్షన్లు మార్చిలోగా వచ్చే విధంగా.. అదేవిధంగా డబల్ బెడ్ రూమ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హులైన ప్రతి ఒక్కరికి విడుతలవారీగా వచ్చే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News