Friday, September 20, 2024
Homeపాలిటిక్స్AP: వైసీపీలోకి అనకాపల్లి టీడీపీ నేత మలశాల

AP: వైసీపీలోకి అనకాపల్లి టీడీపీ నేత మలశాల

భరత్‌కుమార్‌తో పాటు ఆయన తల్లిదండ్రులు చేరారు

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు అనకాపల్లి టీడీపీ నేత మలశాల భరత్‌ కుమార్. తన తల్లిదండ్రులు రమణారావు (విశాఖ డెయిరీ డైరెక్టర్‌), ధనమ్మ (మాజీ ఎంపీపీ) ఈ సందర్భంగా భరత్‌కుమార్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు గంగుపాం నాగేశ్వరరావు (మాజీ డీసీఎంఎస్‌ ఛైర్మన్‌), మలశాల కుమార్‌ రాజా (విశాఖ జిల్లా తెలుగుయువత ప్రధాన కార్యదర్శి). ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News