Saturday, September 28, 2024
Homeఆంధ్రప్రదేశ్Jupadubangla: అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

Jupadubangla: అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం

భక్తి శ్రద్ధలతో పాల్గొన్న స్థానికులు

శ్రావణ పూర్ణిమ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ నంద్యాల జిల్లా, జూపాడుబంగ్లా పారుమంచాల గ్రామం లోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం నందు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వేదపండితులు వేదాంతం శేషభట్టాచార్యులు ఆధ్వర్యంలో సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యాన్ని గురించి సోదాహరణంగా వివరించారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి మాట్లాడుతూ సత్యమే ఈశ్వరుడని, సత్యాన్ని నమ్ముకుంటే అనంతమైన పుణ్యఫలం అందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్టు చైర్మన్ నర్రెద్దుల శ్రీనివాసరెడ్డి, శ్రీ వేణుగోపాల స్వామి సేవా బృందం సభ్యులు మండ్ల పాలరాము, పోచా లోకేశ్వర్ రెడ్డి , మందడి కరుణాకర్ రెడ్డి, చెంచిరెడ్డి, కె.రమణ రెడ్డి, పి. చిన్న. స్వాములు, పి.మద్దిలేటీ, పోచా వెంకమ్మ, మండ్ల ప్రమీల, పి.చింటెమ్మ, బి.సునీత, యం. రాధమ్మ, గ్రంథె రజిత, కె.హేమలతతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News