Saturday, October 5, 2024
HomeతెలంగాణSircilla District : సిరిసిల్ల యువ‌తి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్‌

Sircilla District : సిరిసిల్ల యువ‌తి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్‌

Sircilla District : రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో యువ‌తి కిడ్నాప్ కేసులో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. చందుర్తి మండ‌లం మూడ‌ప‌ల్లిలో శాలిని అనే యువ‌తిని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ఈ రోజు(మంగ‌ళ‌వారం) ఉద‌యం 5 గంట‌ల స‌మ‌యంలో దేవాల‌యం నుంచి బ‌య‌ట‌కు రాగానే తండ్రిని ప‌క్క‌కు తోసేసి కిడ్నాప్ చేసిన సంగ‌తి తెలిసిందే. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఓ వైపు ద‌ర్యాప్తు చేస్తుండగా శాలిని, జానీ క‌లిసి ఓ వీడియో విడుద‌ల చేశారు.

- Advertisement -

త‌నను ఎవ‌రూ కిడ్నాప్ చేయ‌లేద‌ని శాలిని పేర్కొంది. తాను జ్ఞానేశ్వ‌ర్(జానీ) అనే యువ‌కుడిని పెళ్లి చేసుకున్న‌ట్లు తెలిపింది. ఆ వీడియోలో.. తాను నాలుగేళ్లుగా జానీ ని ప్రేమిస్తున్నాను అని చెప్పింది. త‌న కోరిక మేర‌కే జానీ త‌న‌ను తీసుకువెళ్లిన‌ట్లు తెలిపింది. త‌న‌ని ఇష్ట‌పూర్వ‌కంగానే పెళ్లి చేసుకున్న‌ట్లు వెల్ల‌డించింది.

‘నాకు వేరే సంబంధాలు చూస్తున్నార‌ని జానీకి ఫోన్ చేసి చెప్పాను. త‌న‌ని వ‌చ్చి తీసుకువెళ్ల‌మ‌ని కోరాను. అయితే.. మాస్క్ ధ‌రించి ఉండ‌డంతో జానీ ని గుర్తు ప‌ట్ట‌లేక‌పోయా. కారులో ఎక్కించిన త‌రువాత మాస్క్ తీయ‌డంతో జానీని గుర్తుప‌ట్టాను. ఇద్ద‌రం ఇష్టప‌డి పెళ్లిచేసుకున్నాం. నా కుటుంబ స‌భ్యుల నుంచి నాకు ప్రాణ‌హాని ఉంది. మాకు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని పోలీసులు, మీడియాను కోరుతున్నా’ అని శాలిని ఆ వీడియోలో తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News