Sunday, October 6, 2024
HomeదైవంAhobilam: అహోబిలంలో అష్ట బంధన మహా సంప్రోక్షణ

Ahobilam: అహోబిలంలో అష్ట బంధన మహా సంప్రోక్షణ

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

ఎగువ అహోబిలంలో ప్రారంభమైన అష్ట బంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎగువ అహోబిలంలో శనివారం సాయంత్రం నుండి శ్రీ మాలోల నరసింహ స్వామి వారి అష్ట బంధన మహా సంప్రోక్షణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అహోబిల మఠం 46 వ పీఠాధిపతి శ్రీ వన్ శఠగోప శ్రీ రంగనాథ యతేంద్ర మహాదేశికన్ స్వామి వారి అనుజ్ఞ మేరకు రేపటి వరకు ఈ మహా సంప్రోక్షణ కార్యక్రమం ఉంటుందని దేవస్థానం ప్రధాన అర్చకులు కీడంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు.

- Advertisement -

ఇందులో భాగంగా చతుస్థానార్చనం, శాత్తుమురై పూజలు నిర్వహించి మహా సంప్రొక్షన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆయన తెలిపారు. మంగళ వాయిద్యాలు వేదమంత్రాలు నడుమ జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఉత్సవ కార్యక్రమాలు తిలకించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News