గాంధీభవన్ హైదరాబాద్ లో టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిని సింగరేణి రామగుండం ఐఎన్టియుసి నాయకులు కలిశారు. ఈ మేరకు గాంధీభవన్ లో కలిసిన ఐఎన్టియుసి నాయకులు సంఘం కోటాలో ఐఎన్టియుసి నేత జనక్ ప్రసాద్ కు రామగుండం నియోజకవర్గ నుండి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని కోరారు. ఈ సందర్బంగా ఐఎన్టియుసి నాయకులు మాట్లాడుతూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణిలో సుపరిచితుడు, కార్మిక, కర్షక పక్షపాతి అయిన ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ అనునిత్యం కార్మిక సమస్యల కోసం పోరాడటమే కాకుండా రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం త్రాగు, సాగునీటి కోసం, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కొరకు శ్రమిస్తూ, నిరంతరం ప్రజల్లో ఉంటున్నారని తెలియజేసారు. ప్రజల కోసం ఉన్న జనక్ ప్రసాద్ కు రామగుండం నియోజక వర్గ కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వాలని అధిష్టానానికి వినతి పత్రాన్ని అందచేసి కోరినట్లు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు ధర్మపురి, వడ్డేపల్లి దాస్, కాంపెల్లి సమ్మయ్య, బత్తుల పోషయ్యా, తేజవత్ రాంబాబు, కుక్కల ఓదెలు, పానుగంటి వెంకట్ స్వామి, మహబూబ్, జాన్ పాల్గొన్నారు.
Hyd: జనక్ ప్రసాద్ కు కాంగ్రెస్ టికెట్ ఇవ్వండి
టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసిన ఐఎన్టియుసి నాయకులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES