Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: బిఆర్ఎస్ లో పలువురు చేరిక

Mallapur: బిఆర్ఎస్ లో పలువురు చేరిక

రాబోయే ఎన్నికల్లో సంజయ్ ని గెలిపించుకుంటాం

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చూసి నియోజకవర్గంలోని యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు BRSలో చేరుతున్నారని, రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితికి నియోజకవర్గం ప్రజలు పట్టం కడతారని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఎమ్మెల్యే నివాసంలో మల్లాపూర్ మండలంలోని చిట్టాపూర్, సంగెమ్ శ్రీరాంపూర్ గ్రామాలకు చెందిన పలువురు భారత రాష్ట్ర సమితి పార్టీలో ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు, నియోజకవర్గ బి ఆర్ యస్ అభ్యర్థి డా. కల్వకుంట్ల సంజయ్ ల సమక్షంలో చేరారు. తెలంగాణ జన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్, బిజెపి పార్టీ మండల ఉపాధ్యక్షుడు రజినీకాంత్, కాంగ్రెస్ నాయకులు శేఖర్ లతో పాటు రెండు గ్రామాలకు చెందిన 200 మందికిపైగా పార్టీలో చేరారు. నూతనంగా పార్టీలో చేరిన వారికి బారాస పార్టీ నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు రాబోయే ఎన్నికల్లో సంజయ్ ని గెలిపించుకుంటామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, భారస మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, చిట్టాపూర్ సింగిల్ విండో చైర్మన్ మోహన్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు నర్సా రెడ్డి, సంగేమ్ శ్రీరాంపూర్ సర్పంచ్ దిలీప్,వైస్ ఎంపీపీ నగేష్ మండల ప్రధాన కార్యదర్శి సురేష్ రావు,నాయకులు నూతుల లక్ష్మి నారాయణ, అంజి రెడ్డి, ఆది రెడ్డి, నర్సా రెడ్డి ఇరు గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News