Friday, September 20, 2024
HomeతెలంగాణTandur: ప్రజలకు తోడు-నీడ బిఆర్ఎస్ పార్టీ

Tandur: ప్రజలకు తోడు-నీడ బిఆర్ఎస్ పార్టీ

ఎమ్మెల్యే కుటుంబం ఆధ్వర్యంలో కార్యక్రమాలు

ప్రజలకు తోడు నీడ బిఆర్ఎస్ పార్టీ అని వార్డు ఇన్చార్జ్ జావిద్ హుస్సేన్ అన్నారు. తాండూర్ పట్టణ పరిధిలోని 8వ వార్డులో బిఆర్ఎస్ పార్టీ వార్డు ఇంచార్జ్ జావిద్ హుస్సేన్ ఆధ్వర్యంలో పీఆర్ఆర్ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తండ్రి విటల్ రెడ్డి హాజరై సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8వ వార్డు ఇంచార్జ్ జావిద్ హుస్సేన్ ఏర్పాటుచేసిన సహాయం చాలామంది నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. స్థానికుల సంక్షేమం నిమిత్తం మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన సహాయక కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎవరికీ ఎలాంటి సమస్య ఉన్న తక్షణమే సహాయక కేంద్రాన్ని సందర్శించి వారి సమస్యలను తెలియజేస్తే సహాయక కేంద్రం సిబ్బంది వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని వెల్లడించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీశైల్ రెడ్డి మాట్లాడుతూ జావీద్ హుస్సేన్ ఏర్పాటు చేసిన సహాయక కేంద్రం ఎంతో గొప్పదని ఇలాంటి సహాయక కేంద్రాలను ప్రతి మండలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణమే వారి సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజీర్ ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు నాయుమ్ అఫు,  బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ చారి, స్థానిక వార్డు కౌన్సిలర్ వెంకన్న గౌడ్,  నాయకులు సాయప్ప, బాబాసాహెబ్, నిరంజన్ గౌడ్, మహేష్ రెడ్డి, సుందర్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News