Saturday, October 5, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: ఘనంగా క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం

Madhavaram Krishna Rao: ఘనంగా క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవం

కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన స్థానికులు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు..ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కూకట్పల్లిలో నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రారంభించారు…ముందుగా ఉదయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు లక్ష్మి నరసింహ స్వామి వ్రతం చేశారు…అనంతరం సాయంత్రం జరిగిన కుకట్ పల్లి ప్రగతి నివేదన సభలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ …కూకట్పల్లిలో ఒకప్పుడు .. ఏవీబీ పురం..ప్రశాంత్ నగర్..కూకట్ పల్లి గ్రామంలో ఆడపిల్ల లు మంచి నీరు లేక ఇబ్బంది పడే వారని…కానీ నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో కొన్ని లక్షల గ్యాలన్ల నీటి రిజర్వయిర్లు కట్టి నేడు ఆ కొరత తీర్చామని అన్నారు…అలాగే కూకట్పల్లి లో 436 ఏళ్ల చరిత్ర గల రామాలయం పునర్ నిర్మాణం…చిత్తరమ్మా దేవాలయంతో పాటు…మసీదు, చర్చిలకు కూడా తన వంతు సహాయం అందించి అభివృద్ధి చేశామని అన్నారు…ఎంపీ గా గెలిపించిన రేవంత్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు అని వచ్చిన ఎంపీ నిధులు ఎక్కడ పెడుతున్నది ఎవరికి తెలియదు అని ఎద్దావ చేశారు….

- Advertisement -

బీజేపీ ..కాంగ్రెస్ పార్టీ లు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా ..ఫించన్లు 3 వేలు ఇస్తున్నారా అని అలాగే… నిరుపేదల ఆడ బిడ్డ పెళ్లికి 1 లక్షా 116 ఇచ్చిన ఘనత ఉందా అని ప్రశ్నించారు….ఇప్పటికే నియోజక వర్గంలో 44 వేల మందికి ఆసరా ఫించనలు ఇస్తున్నాం అని…ఇపుడు ధరకాస్తు చేసుకున్న వారికి మార్చి నెలలో అందిస్తాం అని అన్నారు….అలాగే అర్హులకు అందరికీ డబల్ బెడ్ రూం ఇల్లు వస్తాయని దీంట్లో సందేహం లేదని అన్నారు….రాబోయే ఎన్నికల్లో అభివృద్ధి చూసి ఓటు వేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో..కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ తో పాటు నియోజక వర్గ కార్పొరేటర్లు అందరూ పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News