Sunday, October 6, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: పాదయాత్రలో కూకట్పల్లి ఎమ్మెల్యే

Madhavaram Krishna Rao: పాదయాత్రలో కూకట్పల్లి ఎమ్మెల్యే

ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ పగుడాల శిరీష బాబురావుతో కలిసి బాలాజీ నగర్ లోని పాదయాత్ర నిర్వహించారు.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన అభివృద్ధికి మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో స్వాగతం పలికారు… ప్రజలు అందించిన వెనుకలు స్వీకరిస్తూ అభివృద్ధిని వివరిస్తూ పాదయాత్ర ముందుకు సాగింది… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ దాదాపు అన్ని డివిజన్లోని ప్రజలకు కావలసిన మౌలిక సదుపాయాలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని ఎక్కడైనా సమస్య ఉంటే పాదయాత్రలో ప్రజలు తెలియపరుస్తున్నారని దానికి సంబంధించిన… పనులకు వెంటనే చర్యలు తీసుకునే విధంగా అధికారులుకు ఆదేశాలు జారీ చేస్తున్నామని చెప్పారు…

- Advertisement -

ప్రతిరోజు వేలమంది హైదరాబాద్ మహానగరంలో అడుగుపెడుతున్న నేపథ్యంలో మంచినీటి సరఫరాకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పటిష్ట ప్రణాళికలు సిద్ధం చేశారని ఇందులో భాగంగానే భూగర్భ పైప్లైన్ వ్యవస్థను మెరుగుపరుస్తున్నామని భవిష్యత్తులో ఇక మంచినీరు కొరత రాకుండా హైదరాబాద్ మహానగరం నిలవబోతుందని అన్నారు… ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ సతీష్ అరోరా డివిజన్ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ..మాజీ కార్పొరేటర్లు శ్రావణ్ కుమార్ ..పగుడాల బాబురావు అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News