Friday, September 20, 2024
HomeతెలంగాణKTR: దేశానికి దిక్సూచిగా తెలంగాణ వైద్యారోగ్యం

KTR: దేశానికి దిక్సూచిగా తెలంగాణ వైద్యారోగ్యం

సిరిసిల్ల మెడికల్ కాలేజ్ ప్రారంభించిన కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కళాశాలను వర్చువల్ విధానంలో హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. సిరిసిల్ల మెడికల్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు హాజరయ్యారు. ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ,తెలంగాణ రాష్ట్రం ప్రతియేటా పదివేల మంది వైద్యులను తయారుచేసే స్థాయికి చేరుకుని భారతదేశ వైద్యరంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదనీ, దేశానికే ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలిపారు. దేశానికే దిక్సూచిగా..తెలంగాణ వైద్య,ఆరోగ్యం నిలుస్తుందన్నారు.తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఉజ్వ‌ల‌మైన దినం ఇది. ఒకే సారి 9 మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభించుకోవ‌డం, సువ‌ర్ణ అక్ష‌రాల‌తో లిఖించ‌ద‌గ్గ ఘ‌ట్టం అని కేసీఆర్ పేర్కొన్నారు. సిఎం కేసీఆర్ చేతుల మీదుగా 9 మెడికల్ కాలేజీలు ప్రగతి భవన్ నుండి వర్చువల్ పద్దతిలో ప్రారంభమయ్యాయి. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ ప్ర‌సంగించారు.ఎన్నో కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటుంటాం.కానీ ఈ కార్య‌క్ర‌మం చాలా ఆత్మసంతృప్తి క‌లిగే గొప్ప స‌న్నివేశం. ఎందుకంటే ప‌రిపాల‌న చేత‌కాదు అని ఎగ‌తాళి చేసిన ప‌రిస్థితుల‌ను చూశాం. అటువంటి తెలంగాణ‌లో ప్ర‌తి జిల్లాకు మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సంవ‌త్స‌రంలో దాదాపు 24 వ‌ర‌కు చేరుకున్నాం. గ‌తంలో ఐదు మెడిక‌ల్ కాలేజీలు ఉంటే,ఇవాళ ఆ సంఖ్య 26కు చేరింది.వ‌చ్చే విద్యా సంవ‌త్స‌రానికి 8 కాలేజీలు నూత‌నంగా ప్రాంరంభం కాబోతున్నాయి.వీటికి కేబినెట్ ఆమోదం కూడా ల‌భించింద‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.2014లో 2850 మెడిక‌ల్ సీట్లు ఉంటే 2023 నాటికి 8515 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయ‌ని కేసీఆర్ తెలిపారు.ఈ సంద‌ర్భంగా వైద్య‌శాఖ మంత్రి, కార్య‌ద‌ర్శిని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిచారు.85 శాతం మెడిక‌ల్ సీట్లు తెలంగాణ బిడ్డ‌ల‌కే ద‌క్కాల‌ని ప‌టిష్టంగా పోరాటం చేసి హైకోర్టులో విజయం సాధించాం.అది గొప్ప విజ‌యం.ప్ర‌యివేటు, గ‌వ‌ర్న‌మెంట్ మెడిక‌ల్ కాలేజీల ద్వారా సంవ‌త్స‌రానికి 10 వేల మంది డాక్ట‌ర్ల‌ను ఉత్ప‌త్తి చేయ‌బోతున్నాం అని కేసీఆర్ పేర్కొన్నారు.మ‌నిషి ఆరోగ్యంగా ఉండాలంటే, రోగ నిరోధ‌క శ‌క్తి ఉండాలంటే,తెల్ల ర‌క్త క‌ణాలు ఏ విధంగా ప‌ని చేస్తాయో,తెలంగాణ ఉత్ప‌త్తి చేయ‌బోయే తెల్ల కోట్ డాక్ట‌ర్లు రాష్ట్రానికే కాదే,దేశ ఆరోగ్య వ్య‌వ‌స్థ‌ను కూడా కాపాడుతారని కేసీఆర్ వివ‌రించారు.తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది.విద్యుత్ రంగంతో పాటు సాగు, తాగునీటి రంగంలో అద్భుతాలు సాధించాం. దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగాం అన్నారు.ఒక దేశం కావొచ్చు, రాష్ట్రం కావొచ్చు,ఎక్క‌డైతే వైద్యారోగ్య వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా ఉంటుందో అక్క‌డ త‌క్కువ మ‌ర‌ణాలు,న‌ష్టాలు సంభ‌విస్తాయని కేసీఆర్ తెలిపారు.దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మెడిక‌ల్ కాలేజీల‌తో పాటు అద్భుత‌మైన ఆస్ప‌త్రుల‌ను కూడా తీసుకువ‌స్తున్నాం. వంద‌లాది బెడ్స్‌తో మెడిక‌ల్ ఫెసిలిటీ వ‌స్తుంది. వైద్యారోగ్య శాఖ చాలా విజ‌యాలు సాధించింది. దేశంలో ప్ర‌తి ల‌క్ష జ‌నాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ.ఇది మ‌న సాధించిన ఘ‌న‌త‌.రాష్ట్రం ఏర్ప‌డే నాటికి 17 వేల ప‌డ‌క‌లు ఉంటే,ఇప్పుడు 34 వేల ప‌డ‌క‌ల‌కు చేరుకున్నాం.మ‌రో 6 హాస్పిట‌ల్స్ నిర్మాణంలో ఉన్నాయి.క‌రోనా టైంలో ఆక్సిజ‌న్ చాలా అవ‌స‌రం ఉండేది.దాన్ని గుణ‌పాఠంగా తీసుకొని ఈరోజు వైద్యారోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో 500 ట‌న్నుల ఆక్సిజ‌న్‌ను ఉత్ప‌త్తి చేసుకుంటున్నాం అని కేసీఆర్ తెలిపారు.

- Advertisement -

ఎటువంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కోనేందుకు మౌలిక స‌దుపాయాలు క‌ల్పించుకున్నాం.50 వేల ప‌డ‌క‌ల‌ను ఆక్సిజ‌న్ బెడ్స్‌గా తీర్చిదిద్దుకుంటున్నాం. 10 వేల సూప‌ర్ స్పెషాలిటీ బెడ్స్ కూడా అందుబాటులోకి వ‌స్తున్నాయి.పారా మెడిక‌ల్ సిబ్బందికి జాతీయ‌,అంత‌ర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంది. మెడిక‌ల్ కాలేజీల‌కు అనుబంధంగా, ప్ర‌తి జిల్లాలో న‌ర్సింగ్ కాలేజీలు, పారా మెడిక‌ల్ కోర్సులు పెట్టాల‌ని చెప్పాం.వాటికి కూడా చ‌ర్య‌లు తీసుకుంటున్నారని సీఎం తెలిపారు.ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర చరిత్రలో సుదినం అని అన్నారు.
ఒక రాష్ట్రం ఒకేసారి 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించడం దేశ వైద్య రంగ చరిత్రలోనే మొదటిసారి.ఇది సీఎం కేసిఆర్ పట్టుదలకు నిదర్శనమన్నారు
రాష్ట్రంలో పేదలకు విద్య, వైద్యం అందుబాటులోకి రావాలని ఆయన మార్గ నిర్దేశంలో ఇంత గొప్ప విజయాన్ని సాధించామన్నారు.గత సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించి తెలంగాణ కొత్త రికార్డు సృష్టించింది.ఈ సంవత్సరం మన రికార్డును మనమే అధిగమించామన్నారు.
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో అందుబాటులోకి వచ్చిన ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ వాటా 43 శాతం. ఇది గొప్ప రికార్డు. దేశంలోని మిగితా 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 57 శాతం సీట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చాయన్నారు.
ఒకప్పుడు బెంగాల్ ఆలోచిస్తుంది.. దేశం అచరిస్తుంది అనే నానుడి ఉండేది. దాన్ని తిరగరాసిన ఘనత సీఎం కేసిఆర్ ది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని సీఎం కేసీఆర్ సంకల్పిస్తే,దేశం మొత్తం అదే దారిలో నడుస్తున్నది.ఇప్పుడు తెలంగాణ అచరిస్తుంది.దేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు.. సాధించుకున్న రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్ దన్నారు.ఈరోజు అడ్మిషన్లు పొందిన వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఇంత గొప్ప పవిత్ర యజ్ఞంలో నాకూ భాగస్వామ్యం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు,ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ ఏ ఎం రిజ్వీ, వైద్య విద్య సంచాలకులు రమేశ్ రెడ్డి, వైద్యశాఖ సిఎం వోఎస్డీ డా.గంగాధర్, కాళోజీ హెల్త్ యూనివర్శిటీ వీ.సీ కరుణాకర్ రెడ్డి, టిఎస్ ఎం ఐ డీసీ ఎం.డీ, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ఎంపీలు దామెదర్ రావు, రాములు,కవిత, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధునూధనాచారి, శేరి సుభాష్ రెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, ఎమ్మెల్యేలు విప్ రేగాకాంతారావు, బాల్క సుమన్, జీవన్ రెడ్డి, మాజీ మంత్రి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News