Thursday, September 19, 2024
HomeతెలంగాణMadhavaram Krishnarao: నాలాలను వెడల్పు చేసి, లోతట్టు ప్రాంతాలను ఆదుకుంటాం

Madhavaram Krishnarao: నాలాలను వెడల్పు చేసి, లోతట్టు ప్రాంతాలను ఆదుకుంటాం

ఈ క్రమంలో ఇళ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు

కూకట్ పల్లి నియోజక వర్గంలోని ఫతే నగర్, అల్లాపూర్ డివిజన్ లలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణారావు, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్ మమత భారీ వర్షాలలో మునిగిపోతున్న కాలనీలను అభివృద్ధి చేయాలన్నారు. ఎమ్మెల్యే కృష్ణారావు నాలా అభివృద్ధి చేస్తూ ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లు అందజేస్తామన్నారు. త్వరలోనే టెండర్ ప్రక్రియ ఏర్పాటు చేసి నాలా సమస్యలను పరిష్కరిస్తామని కమిషనర్ రోనాల్డ్ రాస్ వెల్లడించారు. భారీ వర్షాలతో మునిగిపోతున్న ఇండ్లను ఖాళీ చేపించి, నాలాలను వెడల్పు చేస్తామని, ఈ క్రమంలో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లు అందిజేసి ఖాళీ చేపిస్తామని కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News