Sunday, October 6, 2024
HomeతెలంగాణKorukanti Chander: ప్రజల గుండెల్లో గులాబీ జెండా

Korukanti Chander: ప్రజల గుండెల్లో గులాబీ జెండా

రాబోయే ఎన్నికల్లో బి.ఆర్.ఎస్ గెలుపు ఖాయం

బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు, సీఎం కేసీఆర్ గొప్ప పాలనకు ఆకర్షితులై కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకోవడానికి ఆసక్తి చూపుతున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. 11వ డివిజన్లో ఎమ్మెల్యే చందర్ చేపట్టిన ప్రజా అంకితయాత కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో 12వ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజి బాబు, మేడి సంజీవ్, మేడి సతీష్, చిక్కుడు సదానందం, శ్రీనివాస్, సంపత్ తో పాటు పలువురికి ఎమ్మెల్యే చందర్ గులాబీ కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం మరల వచ్చే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ పటిష్టత కోసం, బలోపేతం కోసం తాము ఎల్లవేళలా కృషి చేస్తామని, రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరే విధంగా పకడ్బంది కార్యాచరణతో ముందుకు సాగుతామని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News