Sunday, October 6, 2024
HomeతెలంగాణMLA Satish Kumar: బీఆర్ఎస్ లోకి చేరికల పరంపర

MLA Satish Kumar: బీఆర్ఎస్ లోకి చేరికల పరంపర

పార్టీ పట్ల అంతకంతకూ పెరుగుతున్న ఆకర్షణ

హుస్నాబాద్ మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన 15 మంది యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు యువకులు, మహిళలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ దినదిన అభివృద్ధి చెందిందని, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని అని అన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ హ్యాట్రిక్ విజయాన్ని సాధించబోతున్నారని, జై సతీష్ కుమార్, జై బీఆర్ఎస్ అనే నినాదాలతో యువకులు హోరెత్తించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి అనేక సంక్షేమ అభివృద్ధి పనులు చేస్తుందని తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములై ముందుకు సాగుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News