Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Budda: కేసులెన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదు

Budda: కేసులెన్ని పెట్టినా భయపడే ప్రసక్తే లేదు

కావాలనే చంద్రబాబుపై అక్రమ కేసులు

కావాలనే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అక్రమ కేసులు బనాయించారని, కేసులకు ఎంత మాత్రం భయపడబోమని, నీతికి నిబద్ధతకు తెలుగుదేశం పార్టీ ఆదర్శమని, త్వరలోనే ముఖ్యమంత్రి జగన్ కు పతనం తప్పదని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా 15 రోజు చేస్తున్న రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల మచ్చలేని వ్యక్తిని జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిందని, కక్షపూరితంగా జగన్ వ్యవహరిస్తూ టిడిపి పార్టీని భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వంలోనే రాష్ట్ర అభివృద్ధి జరిగింది తప్ప ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి లేదని, దోచుకోవడమే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ అభివృద్ధి జరగకపోయినా అంతా అభివృద్ధి జరిగిందని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రజలు అంతా గమనిస్తున్నారని, త్వరలోనే వైసిపి ప్రభుత్వన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటికి వస్తారని అన్నారు. జగన్ చేస్తున్న అక్రమాలకు అన్ని ఇన్ని కావని త్వరలోనే జగన్ కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కంచర్ల గోవిందరెడ్డి, శాఖమూరి గిరిరాజు, పలువురు న్యాయవాదులు, టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News