Friday, September 20, 2024
Homeపాలిటిక్స్KTR: బతికున్నన్నాళ్లూ సిరిసిల్ల ప్రజలకు సేవ చేస్తా

KTR: బతికున్నన్నాళ్లూ సిరిసిల్ల ప్రజలకు సేవ చేస్తా

అభివృద్ధికి కేరాఫ్ గా సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు మండల కేంద్రంలో పండుగ వాతావరణంలో మండలంలో 378 డబుల్ బెడ్ రూమ్ గృహ సముదాయాలను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం రోజు ప్రారంభోత్సవం చేశారు.కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి కేటీఆర్
లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి కేటిఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమంలో బోధన అందిస్తున్నాం అన్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆంగ్లంలో మాట్లాడుతుంటే నా గుండె గర్వంతో ఉప్పొంగుతుందని సంతోషపడ్డారు.సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎడారులను తలపించేవని,ఇప్పుడు ఏ చెరువు చూసినా నిండు కుండనే అన్నారు.నర్మాల డ్యాంను నింపాలని ఈ ప్రాంత ప్రజలు గంభీ రావుపేట నుండి హైదరాబాద్ లోని సిఎం ను కలిసేందుకు వెళ్లిన రోజులు గుర్తుకు తెచ్చుకోండి అన్నారు.

- Advertisement -

ప్రతిగా అప్పటి పాలకులు మొక్కుబడిగా శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు.ఇప్పుడు నర్మాల డ్యాం 365 రోజులు నిండు కుండలా ఉంటుందని,కుడవెల్లి నుంచే కాకుండా ప్యాకేజి -9 ద్వారా నర్మాల డ్యాం ను నింపనున్నాం తెలిపారు.స్వరాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని గ్రామీణ నియోజకవర్గాలను అభివృద్ధి చేశారు.రైతుల ఖాతాలో 73 వేల కోట్లు జమ చేశారు.వ్యవసాయానికి ఉచిత విద్యుత్ రైతు బీమా సకాలంలో ఎరువులు, విత్తనాలను అందజేస్తున్నారు.9 ఏండ్లలో గంభీరావుపేట మండలంను అన్ని విధాలుగా అభివృద్ధి చేశాం అని అన్నారు.చెరువును అభివృద్ధి చేయడంతో పాటు కేజీ టు పీజీ క్యాంపస్ ను ఏర్పాటు చేశాం అని పేర్కొన్నారు.ఈ రోజు 13.5 కోట్లతో లింగన్నపేట -గంభీరావుపేట మధ్య హై లెవెల్ వంతెన కు శంకుస్థాపన చేస్తున్నాం అని వచ్చే వర్షాకాలంలోగా దీనిని పూర్తి చేస్తాం స్పష్టం చేశారు.నర్మాల వద్ద మరో రెండు హై లెవెల్ వంతెనలను నిర్మిస్తాం అని తెలిపారు.
గతంలో మున్సిపాలిటీగా ఉన్న గంభీరావుపేట ను తిరిగి మున్సిపాలిటీ గా చేస్తాం అన్నారు. గంభీరావుపేట పాత జీపి వద్ద రూ.3 కోట్లతో అధునాతన మార్కెట్ ను నిర్మిస్తాం అని,₹3 కోట్లతో లక్ష్మిపూర్ రోడ్డును నిర్మించనున్నాం అని తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 640 గుడిసెలు,432 రేకుల షెడ్లు,907 శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసిస్తున్న వారికి మొత్తం 1967 మందికి ప్రథమ ప్రాధాన్యతగా గృహలక్ష్మి కింద మంజూరు చేస్తున్నాం పేర్కొన్నారు. బ్రతికి ఉన్నన్నాల్లు సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాం అని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News