Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Bhagat Singh: జ్వలించే నిప్పుకణిక భగత్‌ సింగ్‌

Bhagat Singh: జ్వలించే నిప్పుకణిక భగత్‌ సింగ్‌

నేడు భగత్ సింగ్ జయంతి

రవి అస్తమించని సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసి తమకు ఎదురు లేదు అంటున్న బ్రిటిష్‌ సామ్రాజ్యాన్ని ఎదురు నిలిచి దేశమాత విముక్తి కోసం విజయము వీరమరణము అంటూ యువతను ఉత్తేజపరిచి తప్పించుకుని మార్గాలు మిక్కుటంగా ఉన్నe పిరికితనం చూపక ధైర్యం పట్టుబడి ఉరికొయ్యలను ముద్దాడిన మహోన్నత వ్యక్తి మహోన్నత విప్లవకారుడు సర్దార్‌ భగత్‌ సింగ్‌. భగత్‌ సింగ్‌.. ఈ పేరు వినగానే నరాల్లో నెత్తురు హైస్పీడ్ తో ప్రవహిస్తుంది, రోమాలు నిక్కబొడుచుకుంటాయి. స్వాతంత్య్ర ఉద్యమంలో రాజీలేని పోరాటం చేశాడు భగత్‌ సింగ్‌. గాంధీ అహింసా పోరాటాన్ని వ్యతిరేకించారు. హింసా మార్గంలోనే స్వాతంత్య్రం సిధ్దిస్తుందని నినదించాడు. భగత్‌ సింగ్‌ ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్‌ ప్రాంతంలోని ఖత్కర్‌ కలాన్‌ అనే గ్రామంలో 1907, సెప్టెంబరు 28న జన్మించాడు. అతని తల్లిదండ్రులు కిషన్‌ సింగ్‌, విద్యావతి. భగత్‌ సింగ్‌ తాత అర్జున్‌ సింగ్‌ స్వామి దయానంద సరస్వతికి అనుచరుడు. అలాగే హిందూ సంస్కరణ ఉద్యమంలోనూ పాల్గొన్నాడు. అతని ప్రభావం భగత్‌పై బాగా ఉండేది. పదమూడేళ్ల ప్రాయంలో మహాత్మాగాంధీ సహాయ నిరాకర ణోద్యమం కూడా భగత్‌ పై విపరీత ప్రభావం చూపింది. భగత్‌ సింగ్‌ మూడేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు అతని తండ్రి భగత్‌ సింగ్‌ ను తీసుకొని కొత్తగా వేస్తున్న తోటను చూడ్డానికి పొలాల్లోకి వెళ్ళాడు. అక్కడ భగత్‌ సింగ్‌ పొలంలో దిగి ఆడుకుంటూనే చిన్న చిన్న గడ్డిపరకలను నాటడం మొదలు పెట్టాడు. ‘ఏం చేస్తున్నావ్‌ నాన్నా?‘ అని అడిగాడు తండ్రి. భగత్‌ సింగ్‌: ‘తుపాకులు నాటుతున్నా‘, ‘చెట్టు పెరిగి, తుపాకులు కాస్తాయి’ అని సమాధానం ఇచ్చాడు
భవిష్యత్తుకు బాల్యమే మొలక. మొలకలు వేసే వయస్సులో తుపాకులను మొలకెత్తించాలని చూడడం అతని వ్యక్తిత్వానికి మచ్చుతునక. విద్యార్థి దశలో అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్‌ సింగ్‌. బాబాయి సర్దార్‌ అజిత్‌ సింగ్‌ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో, కంట నీరు పెట్టుకొనే చిన్నమ్మ హర్నామ్‌ కౌర్‌ ను చూసి నాలుగేళ్ళ భగత్‌ సింగ్‌ ‘పిన్నీ ఏడవొద్దు. నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా‘ అని ప్రతిజ్ఞలు చేసేవాడు. ప్రత్యక్షంగా ఆ స్వాతంత్య్ర పోరాటంలో మొదటిసారి పాల్గొన్నాడు. ప్రభుత్వ పుస్తకాలను, దుస్తులను తగులబెట్టాడు. అయితే గాంధీ చేపట్టిన అహింసా ఉద్యమం వల్లే కాకుండా, హింసాత్మక ఉద్యమంతో కూడా బ్రిటిష్‌ వారి ఆగడాలకు చెక్‌ పెట్టాలన్న ఆలోచనలో ఉండేవాడు. 1919లో జరిగిన జలియన్‌ వాలా బాగ్‌ దురంతం అతనిలో బ్రిటిష్‌ వారి పట్ల కోపాన్ని మరింత పెంచింది.
యుక్త వయసుకు వచ్చాక లాహోర్‌లోని నేషనల్‌ కాలేజీలో చేరాడు. అప్పుడే అతనికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. దీంతో భగత్‌ ఓ ఉత్తరం రాసి ఇంటి నుంచి పారిపో యాడు. ఆ ఉత్తరంలో నా జీవితం దేశానికి అంకితం చేయాలను కుంటున్నాను. నాకు ఇంకే కోరిక లేదు అని రాశాడు. ఇంటి నుంచి పారిపోయి నవ జవాన్‌ భారత సభ అనే సంఘంలో చేరాడు. ఆ సంఘం ద్వారా యువకులను ఆకర్షించి స్వాతంత్య్రోద్యమ సాధనకు పురికొల్పాడు. అనంతరం హిందూస్థాన్‌ గణతంత్ర సంఘంలోనూ చేరాడు. అక్కడే అతనికి సుఖ్‌ దేవ్‌ పరిచయమయ్యాడు. ఇద్దరు అనతి కాలంలోనే ఆ సంఘానికి నాయకులయ్యారు. బ్రిటిష్‌ ప్రభుత్వంపై హింసాత్మక ఉద్యమానికి సిద్ధమయ్యారు. అదే సమయంలో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశంలో సైమన్‌ గో బ్యాక్‌ ఉద్యమాన్ని స్వాతంత్య్ర ఉద్యమకారులు. అందులో భాగంగా లాహోర్‌లో లాలాలజపతి రాయ్‌ బ్రిటిష్‌ సాయుధ బలగాలను ఎదురొడ్డి నిలిచారు. సూపరింటెండెంట్‌గా సాండర్స్‌ లాఠీతో లాలా లజపతిరాయ్‌ పై విరుచుకుపడ్డాడు. తల పగలగొట్టాడు, ఛాతీపైనా గాయమంది.
పంజాబ్‌ కేసరి నేల కొరిగాడు. అతని మరణం భగత్‌ సింగ్‌, సుఖ్‌ దేవ్‌, రాజ్‌ గురులలో ఆగ్రహాన్ని నింపింది. చెమర్చిన కళ్లతోనే సాండర్స్‌ అంతు చూశారు. కసి తీరా కాల్చి చంపారు. ఆ హత్యకు కారణమైన వారిని ఉరితీయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం 1929లో అసెంబ్లీపై బాంబులు విసిరారు. ఆ సంఘటనలో ఎవరూ గాయపడలేదు. అనంతరం ముగ్గురు లొంగిపోయారు. దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. అనంతరం వారిపై బ్రిటిష్‌ ప్రభుత్వం సాండర్స్‌ హత్యా నేరం మోపింది. భగత్‌ సింగ్‌, రాజ్‌ గురు, సుఖ్‌దేవ్‌లు నేరాన్ని ఒప్పుకున్నారు. కోర్టులో బ్రిటిష్‌ వ్యతిరేక నినా దాలు చేశారు. కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. ఉరి కంబాన్ని ఎక్కే కొద్ది రోజుల ముందు భగత్‌ సింగ్‌ తన మాతృమూర్తితో ఇలా అన్నారు. ‘నేను చనిపోతే దేశానికి అదో ఉత్పాతంగా మిగిలిపోతుంది. నేను నవ్వుతూ మృత్యువుని అల్లుకుంటే భారతదేశంలో వున్న మాతృ మూర్తులు అందరూ తమ బిడ్డలు భగత్‌ సింగ్‌లా కావాలని కోరుకుంటారు. బలీయమైన స్వాతంత్య్ర కాంక్ష వున్న సమరయోధులు అసంఖ్యాకంగా ఉద్భవిస్తారు. అప్పుడే విప్లవ యోధులు సాగిస్తున్న పోరాటాన్ని నిలువరించడం దుష్టశక్తులకు సాధ్యం కాదు. అప్పుడు భగత్‌ సింగ్‌ తల్లి ఇలా స్పందించారు ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు చనిపోవలసిందే. గొప్ప మరణం అనేది ఎలా వుంటుంది అంటే ప్రపంచమంతా ఆ మరణం గురించే చెప్పుకుంటుంది అని. తన బిడ్డ ఉరి కొయ్యని ముద్దాడే ముందు చివరిసారి ఇచ్చిన నినాదం ఇంక్విలాబ్‌ జిందాబాద్‌. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ ఆ ముగ్గురు యోధులు ఉరి కొయ్యను ముద్దాడారు. 25 ఏళ్ళ వయసులోనే ఉరిశిక్ష పడుతుందని తెలిసినా భగత్‌ చేసిన సాహసం అసామాన్యం. ఇప్పటి యువత, రాజకీయ నాయకులు భగత్‌ సింగ్‌ని కచ్చితంగా ఆదర్శంగా తీసుకోవాలి.

  • సభావట్‌. కళ్యాణ్‌
    ఏబీవీపీ రాష్ట్ర నాయకులు
    90143 22572.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News