Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: వైఎస్సార్ వాహన మిత్ర పంపిణి

Kurnool: వైఎస్సార్ వాహన మిత్ర పంపిణి

జిల్లాలోని 12,474 డ్రైవర్ల ఖాతాల్లోకి 12.47 కోట్లు

వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా జిల్లాలోని 12,474 ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్లకు అండగా ఉండేందుకు గాను రూ.12.47 కోట్ల రూపాయలను వారి ఖాతాలలోకి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసిందని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన తెలిపారు. విజయవాడ విద్యాధరపురం నుండి వైఎస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,75,931 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్ల ఖాతాలో ఐదవ విడత ఆర్థిక సహాయంగా రూ.275.93 కోట్ల రూపాయల మొత్తాన్ని బటన్‌ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తిలకించారు. శుక్రవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాలు నుండి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.సృజన, కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్దూరు సుభాష్ చంద్రబోస్, డిప్యూటీ రవాణా కమీషనర్ కె.శ్రీధర్, ఆర్టీఓ ఎస్.రమేష్ లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు యజమానులు, డ్రైవర్లు ఎవరి మీద ఆధార పడకుండా సొంతంగా ఆటో కొనుక్కొని తమకు తాము స్వయం ఉపాధిని కల్పించుకుంటూ స్వయం శక్తి మీద ఆధారపడి వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని వీరు రోజు లక్షల మందికి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుస్తున్నారని వీరికి ఆసరాగా ప్రభుత్వం వైయస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఈరోజు వారి ఖాతాల్లోకి జమ చేసే నగదును కూడా కలుపుకుంటే దాదాపుగా ఒక్కొక్క కుటుంబానికి 50 వేల రూపాయలు జమ చేశామన్నారు.

ఆటో, టాక్సీ, మాక్సీ, యండియు డ్రైవర్ల వాహనాలకు ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని కారణంగా చలాన్లు కట్టే పరిస్థితి రాకూడదనే సదుద్దేశంతో వైయస్సార్ వాహన మిత్ర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకుగాను ఆటో, టాక్సీ, మాక్సీ, యండియు డ్రైవర్లు వారి వాహనాలకు చెందిన ఫిట్నెస్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్ల ఇబ్బందులను గుర్తించి వారి కోసం వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రవేశ పెట్టడం జరిగిందని, సదరు నగదును వాహన ఫిట్నెస్, నిర్వహణ భారం ఉండకూడదనే సదుద్దేశంతో ఆర్థిక సాయం మంజూరు చేయడం జరిగిందని సదరు నగదును వాహన నిర్వహణ తదితర వాటి కోసం పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని తెలిపారు. అదే విధంగా కరోనా లాంటి కష్టకాలంలో కూడా ప్రభుత్వానికి రావలసిన ఆదాయం లేని పరిస్థితిలో కూడా ఆటో, టాక్సీ, మాక్సీ డ్రైవర్లకు ఏమాత్రం ఇబ్బంది కలగజేయకుండా నేరుగా వారి ఖాతాల్లోకి ఆర్థిక సహాయం జమ చేశామన్నారు.

వైఎస్సార్ వాహన మిత్ర పథకం క్రింద జిల్లాల్లోని ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్ల ఖాతాల్లో వరుసగా ఐదవ విడత ఆర్థిక సాయంగా జమైన నగదు వివరాలు నియోజకవర్గాల వారీగా ఆదోని నియోజకవర్గానికి సంబంధించి 1564 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.1.56కోట్లు, కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించి 820 మంది ఆటో,టాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.82లక్షలు, కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి 4748 మంది ఆటో,టాక్సీ,మ్యాక్సీ,క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.4.74కోట్లు, మంత్రాలయం నియోజకవర్గానికి సంబంధించి 980 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.98లక్షలు, ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి 752 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.75లక్షల 20వేలు, పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి 1374 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.1.37కోట్లు, ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబందించి 1125మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.1.12కోట్లు, పాణ్యం నియోజకవర్గానికి సంబందించి 1111 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్ల ఖాతాలో రూ.1.11కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసి వారికి అండగా నిలిచిందిని కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్ చేతుల మీదుగా రూ.12.47 కోట్ల మెగా చెక్కును ఆటో, టాక్సీ, మ్యాక్సీ, క్యాబ్, యండియు డ్రైవర్లకు అందించారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణమ్మ, రవాణా శాఖ సిబ్బంది, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News