Sunday, October 6, 2024
HomeదైవంSrisailam: సామవేదం వారిచే ప్రవచనాలు

Srisailam: సామవేదం వారిచే ప్రవచనాలు

9 రోజులపాటు శ్రీశైల మహిమా విశేషాలు ప్రవచనం

ధార్మిక కార్యక్రమాలలో భాగంగా దేవస్థానం ఆదివారం 01.10.2023 నుంచీ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మచే ‘శ్రీశైల మహిమా విశేషాలు’ అనే అంశంపై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
మొత్తం 9 రోజులపాటు జరిగే ఈ ప్రవచనాలు ఈ నెల 9వ తేదీతో ముగియనున్నాయి. ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ప్రతీరోజు సాయంకాలం గం. 7.00 నుండి గం. 8.30ల వరకు ఈ ప్రవచన కార్యక్రమం నిర్వహించబడుతుంది.

- Advertisement -


కాగా ఈ ప్రవచన కార్యక్రమములో ప్రవాచకుల వారు శ్రీస్వామి అమ్మవార్ల ఆవిర్భావం, శ్రీశైల మహాక్షేత్ర ప్రత్యేకతలు, మహిమా విశేషాలు మొదలైన అంశాలను వివరించనున్నారు. కావున భక్తులందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేయాలని శ్రీశైల దేవస్థానం కోరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News