Saturday, October 5, 2024
HomeతెలంగాణMallapur: పేదింటి కల నేరవేర్చిన కెసిఆర్ కు రుణపడి ఉందాం

Mallapur: పేదింటి కల నేరవేర్చిన కెసిఆర్ కు రుణపడి ఉందాం

మల్లాపూర్ లో గృహలక్ష్మి లభిదారులకు ప్రొసిడింగ్ పత్రాలు పంపిణి

తెలంగాణలో ఉండటానికి ఇల్లులేని పేదలకు గొప్ప వరంగా గృహలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకవచ్చారని, గృహలక్ష్మి పథకం ద్వారా ఇల్లులేని వారు నూతన ఇల్లు నిర్మించుకోవచ్చని కోరుట్ల శాశనసభ్యులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని కెఎంఆర్ గార్డెన్స్ లో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, బి ఆర్ ఎస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు.

- Advertisement -

లబ్ధిదారులకు ప్రోసింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ ప్రతిపక్షాలను నమ్మవద్దని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది కెసిఆర్ అని, రాష్ట్రంలో ఎన్నో గొప్ప పథకాలు తీసుకువచ్చారని, గృహలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలకు ఇల్లు నిర్మించుకోవడం ఒక వరంగా మారిందని అన్నారు. గత ప్రభుత్వాలు చేయలేని ఎన్నో పనులు బారాస ప్రభుత్వం చేపట్టిందని సంజయ్ అన్నారు.

ఈ సందర్భంగా కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ఇన్ని ఏళ్ళు గుర్తుకురాని పసుబోర్డు ఇప్పుడు గుర్తుకు వచ్చిందని, ఎలక్షన్లు వస్తున్నందున అబద్దపు హామీలనీ ప్రధానమంత్రి ఇస్తున్నారని, ఇప్పటికి ఒకసారి మోసపోయి కవిత ను ఓడగొట్టుకున్నామని, రాబోయే ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ లకు బుద్ధి చెప్పాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలపరిచి తన కుమారుడైన సంజయ్ని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఇటి కార్యక్రమంలో జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరోజన, సర్పంచులు,ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, గృహలక్ష్మి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News