Friday, April 18, 2025
HomeతెలంగాణArutla Dasamantha: అందరి చూపు బిజెపి వైపే

Arutla Dasamantha: అందరి చూపు బిజెపి వైపే

వచ్చేది మా ప్రభుత్వమే

తెలంగాణలో రాబోయేది బిజెపి ప్రభుత్వం అని, తెలంగాణ ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని జనగామ జిల్లా బిజెపి అధ్యక్షుడు ఆరుట్ల దశమంత ఆశాభావం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్, మండల నాయకులు మహేందర్ రెడ్డి, లక్ష్మా రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. బిజెపి ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందనే ప్రశ్నకు కిషన్ రెడ్డి బహిరంగంగా జవాబు చెబుతానంటే ఏ ఒక్క పార్టీ నాయకులు ముందుకు రాలేదని ఎద్దేవా చేశారు. ప్రజలందరూ అభివృద్ధి చెందాలని లక్ష్యంతో కంకణబద్ధులై బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా బీఆరెస్ ప్రభుత్వం మాయమాటలు మానుకొని, ప్రజలకు కావల్సిన అభివృద్ధి పనులు చేసి, తమ చిత్తశుద్ధి చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News