Sunday, October 6, 2024
HomeతెలంగాణMadhavaram Krishna Rao: మాధవరం కృష్ణారావు పాదయాత్ర @ 45 రోజులు

Madhavaram Krishna Rao: మాధవరం కృష్ణారావు పాదయాత్ర @ 45 రోజులు

ప్రగతి నివేదన సభతో పాదయాత్ర ముగింపు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 45 రోజుల పాదయాత్ర ముగించుకున్న అనంతరం దీనికి సంబంధించి.. నియోజకవర్గ అభివృద్ధి పై ప్రగతి నివేదన సభకు ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ 5వ తేదీ సాయంత్రం 4 గంటలకు విచ్చేస్తున్నారు.. ఈ నేపద్యంలో ఫోరమ్ మాల్ వద్ద కేటీఆర్ పార్కు స్థలమును పరిశీలించిన అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… ప్రగతి నివేదన సభకు మంత్రి కేటీఆర్ విచ్చేస్తున్న సందర్భంగా ఆయన 40 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని తెలిపారు..

- Advertisement -

అనంతరం ప్రగతి నివేదన సభలో పాల్గొంటారని వివరించారు… ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక వేల కోట్ల రూపాయలతో కూకట్ నియోజక వర్గం అభివృధి చేసిన ఘనత కేసీఅర్ ప్రభుత్వందే అని ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు…

నియోజకవర్గంలోని.. 15 వేల మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ అలాగే..45 వేల మంది లబ్ధిదారులకు ఆసర పెన్షన్లు, అర్హులైన వారికి విడతలవారీగా డబుల్ బెడ్ రూములు అందించిన ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు… ఐదో తేదీన జరుగు ఈ సభకు నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు తప్పకుండా విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News