Friday, September 20, 2024
HomeNewsHuzurabad: మా మద్దతు 'గులాబీ'కే

Huzurabad: మా మద్దతు ‘గులాబీ’కే

పలు సంఘాల ఏకగ్రీవ తీర్మానాలు

హుజురాబాద్ నియోజకవర్గంలో గులాబీ హవా నడుస్తోంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి గ్రామాల్లో సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం నిర్వహిస్తుండగా మరోవైపు గులాబీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఏకగ్రీవంగా మద్దతు ఇస్తామంటూ పలు సంఘాలు ముందుకు వస్తున్నాయి. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన కుల సంఘాలు వృత్తి సంఘాలు కార్మిక కర్షక సంఘాలు రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి ఏకగ్రీవంగా మద్దతునిచ్చి బి అర్ ఎస్ అభ్యర్థి పార్టీ కౌశిక్ రెడ్డిని గెలిపించుకుంటామని ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి.

- Advertisement -

ఆయా సంఘాల నాయకులు ప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి కౌశిక్ రెడ్డికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. హుజురాబాద్ కన్జ్యూమర్స్ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, మోటార్ ఫీల్డ్ అసోసియేషన్, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని కలిసి ఏకగ్రీవ తీర్మానాలు చేసి తమ మద్దతు రాబోయే ఎన్నికల్లో బీ అర్ ఎస్ పార్టీకి ఉంటుందని వెల్లడించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తుందని, తమకు ఎలాంటి ఇబ్బంది లేదని, బిజినెస్ ఫ్రెండ్లీ ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని అయా సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కరెంటు కొరత లేకుండా చేశారని, అలాగే రోడ్లు బాగు చేశారని, హుజురాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకువచ్చారని అన్నారు. హుజురాబాద్ టిఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డికి తాము ఏకగ్రీవ మద్దతు ఇస్తామని వారు తెలిపారు. కౌశిక్ రెడ్డి విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని వారు పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News