Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Budd Rajasekhar: నడవడం కూడా నేరమా?

Budd Rajasekhar: నడవడం కూడా నేరమా?

టిడిపి కార్యకర్త నారాయణను చావ బాదుతారా?

వైసీపీ ప్రభుత్వంలో రోడ్డుపై నడవడం కూడా నేరమైందని, టిడిపి ప్రభుత్వంలో మాజీ నాయుడు ఇలాగే చేసి ఉంటే అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్ అన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసేవారా అని టిడిపి మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేతకు మద్దతుగా, భువనేశ్వరికి సంఘీభావంగా నంద్యాల జిల్లా, శ్రీశైలం నియోజకవర్గం, చిన్నదేవాలాపురం గ్రామ టిడిపి కార్యకర్త నారాయణ శాంతియుత పాదయాత్ర చేపడితే దాడి చేయడం సమంజసం కాదన్నారు. ఈ సందర్భంగా బుడ్డా మాట్లాడుతూ శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న వృద్ద టిడిపి కార్యకర్త నారాయణను వినుకొండ నియోజకవర్గం, విఠంరాజుపల్లి వద్ద అడ్డుకుని ముఖంపై పైశాచికంగా విరుచుకుపడి ముఖం చిద్రం అయ్యేలా, దంతాలు ఊడేలా వైసీపీ మూకలు దాడి చేశాయని, వైసీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అరాచకాలకు, అవినీతికి వ్యతిరేకంగా నోరు తెరిస్తే అక్రమ కేసులు, అరెస్ట్ లు, నడిస్తే దాడులు చేస్తున్నారన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News