Friday, October 18, 2024
Homeచిత్ర ప్రభChiranjeevi : ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి అనే ఆలోచించా..

Chiranjeevi : ఇంతకాలం నాకేంటి? నా కుటుంబానికేంటి అనే ఆలోచించా..

- Advertisement -

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఒకపక్క సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సేవా కార్యక్రమాలు, వేరే సినిమాలకి సపోర్ట్ ఇవ్వడం వంటివి చేస్తున్నారు. సినీ పెద్దగా సినీ పరిశ్రమ గురించి ఆలోచిస్తున్నారు. ఇటీవలే దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ సినిమాకి ఒక షాయరీని వాయిస్ ఓవర్ గా చెప్పారు మెగాస్టార్.

దీని గురించి కృష్ణవంశీతో చర్చిస్తూ ఓ ఇంటర్వ్యూలా చేశారు. కృష్ణవంశీతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిరంజీవి.

చిరంజీవి మాట్లాడుతూ.. ఇన్నాళ్లు నేను నాకేంటి, నా కుటుంబానికేంటి అనే కోణంలోనే ఆలోచించాను. ప్రస్తుతం నా కుటుంబ సభ్యులు అంతా సెట్ అయ్యారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ఇక చాలు. భగవంతుడు నేను అనుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చాడు నాకు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలనుకున్నాను. ఇప్పటిదాకా ఇచ్చింది చాలా తక్కువ, ఇంకా ఇస్తాను, ఇవ్వాల్సి ఉంది. కీర్తి, సినిమా గ్లామర్.. ఇవేమి శాశ్వతం కాదు. వ్యక్తిత్వమే శాశ్వతం అని నేను నమ్ముతాను అని తెలిపారు. దీంతో చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News