Sunday, October 6, 2024
HomeతెలంగాణPailla Sekhar Reddy: బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

Pailla Sekhar Reddy: బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం

6న భువనగిరిలో జరగనున్న సీఎం సభ

బిఆర్ఎస్ పార్టీ భూదాన్ పోచంపల్లి పట్టణ, మండల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి, సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఓటరుకు తెలియజేసి నాయకులంతా ఐక్యంగా పనిచేసి జరిగిన అభివృద్ధిని ప్రజలవద్దకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం 16న భువనగిరిలో జరగనున్న సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ విజయవంతం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మడుగుల ప్రభాకర్ రెడ్డి, జెడ్పిటిసి కోట పుష్పలత మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, పోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టిపోలు విజయలక్ష్మి శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ కందడి భూపాల్ రెడ్డి, రైతు సమన్వయ సమితి చైర్మన్ రావుల శేఖర్ రెడ్డి, ఎంపిటిసిలో ఫోరం మండల అధ్యక్షులు బత్తుల మాధవి శ్రీశైలం, మున్సిపల్ వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాటి సుధాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సిలువేరు బాల నరసింహ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఆయా గ్రామాల సర్పంచ్లు మున్సిపల్ కౌన్సిలర్లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు టిఆర్ఎస్ పార్టీ పట్టణ- గ్రామాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిలు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News