Thursday, October 3, 2024
HomeతెలంగాణPadi Kaushik: అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం

Padi Kaushik: అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం

ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి

రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగించుకుందామని అందుకు అన్ని వర్గాల ప్రజలు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎన్నికల్లో అత్యధిక మెజారితో గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజరాబాద్ మండలం పోతిరెడ్డి పేట, వెంకట్రావుపల్లి, సిర్సపల్లి గ్రామాలలో బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకుల, కార్యకర్తల సమావేశాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో అందరం కష్టపడి పనిచేసి బి ఆర్ ఎస్ పార్టీని గెలిపించి అందరం ఐక్యంగా పనిచేసే సీఎం కేసీఆర్ గారికి కానుకగా ఇద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణి సురేందర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొండల్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఐలయ్య , పోతిరెడ్డి పేట సర్పంచ్ పుల్లాచారి, ఎంపీటీసీ శ్రీనివాస్, వెంకట్రావుపల్లి సర్పంచ్, సిరిసపల్లి సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News